తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అర్జున్ రెడ్డి' కాంబినేషన్ మరోసారి..!

విజయ్- షాలినీ పాండే.. మరోసారి వెండితెరపై జంటగా కనిపించనున్నారు. ఇప్పటికే వీరిద్దరు 'అర్జున్ రెడ్డి'తో సినీ ప్రియుల మనసు దోచేసుకున్నారు.

By

Published : May 13, 2019, 8:24 AM IST

'అర్జున్ రెడ్డి' కాంబినేషన్ మరోసారి..!

'అర్జున్‌ రెడ్డి'.. ఈ సినిమా పేరు చెప్పగానే హీరో విజయ్‌ దేవరకొండ - హీరోయిన్​ షాలినీ పాండేల అద్భుత నటన కళ్లముందు మెదులుతుంది. అర్జున్‌గా విజయ్‌ ఎంతగా ఒదిగిపోయాడో.. ప్రీతిగా షాలిని అంతే చక్కగా పాత్రలో లీనమై నటించింది. అందుకే తెరపై వీరిద్దరి కెమిస్ట్రీకి సినీప్రియులు నీరాజనం పట్టారు. ఇప్పుడీ జోడీ మరోసారి తెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

అర్జున్ రెడ్డి సినిమాలోని ఓ స్టిల్

‘డియర్‌ కామ్రేడ్‌’తో పాటు దర్శకుడు క్రాంతి మాధవ్‌ తెరకెక్కిస్తున్న చిత్రంతో ప్రస్తుతం బిజీగా ఉన్న రౌడీ హీరో.. వీటి తర్వాత నూతన దర్శకుడు ఆనంద్‌ అన్నామలైతో ఓ సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. తెలుగు, తమిళంలో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం విజయ్ ఇప్పటికే దిల్లీలో ప్రొఫెషనల్‌ బైకర్స్‌ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు.

ఇందులో ఇద్దరు హీరోయిన్లుకు చోటుంది. ‘పేటా’ ఫేం మాళవిక మోహనన్‌ ఓ కథానాయికగా కనిపించనుండగా, మరో పాత్రలో షాలినీ పాండేను ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన రానుంది. ఈ చిత్రానికి ‘హీరో’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details