తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'వేధింపులు తట్టుకోలేక ట్విట్టర్​కు గుడ్​బై'

ప్రముఖ బాలీవుడ్​ దర్శకుడు అనురాగ్​ కశ్యప్​ మరోసారి వార్తల్లో నిలిచాడు. తన కుటుంబానికి ప్రాణహాని ఉందని పేర్కొంటూ కొన్ని ట్వీట్లు చేశాడు. అనంతరం ట్విట్టర్​ నుంచి వైదొలిగాడు.

By

Published : Aug 11, 2019, 8:58 AM IST

'వేధింపులు తట్టుకోలేక ట్విట్టర్​కు గుడ్​బై'

బాలీవుడ్​ దర్శకుడు అనురాగ్​ కశ్యప్​ తన ట్విట్టర్​ ఖాతాను తొలగించాడు. "భయంలేకుండా మాట్లాడే స్వేచ్ఛ లేనప్పుడు అసలు మాట్లాడకుండా ఉండటమే మంచిది" అని చివరిగా సందేశం పోస్ట్​ చేశాడు. ఇటీవల తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ప్రధాని నరేంద్ర మోదీకి ట్వీట్​ చేయడం సంచలనమైంది. మరోసారి ఇదే అంశాన్ని తెరపైకి తెస్తూ సోషల్​ మీడియా ఖాతా నుంచి వైదొలిగాడు.

" తల్లిదండ్రులకు బెదిరింపులు, కూతురికి అంతర్జాలం వేదికగా ఇబ్బందులు వస్తుంటే ఎవరూ మాట్లాడాలని అనుకోరు. ఇదంతా ఏ కారణంతో ఎవరు చేస్తున్నారో తెలియదు. కొందరు దుండగులు ఇలాంటి పద్ధతిని ఎంచుకొని రాజ్యమేలుతున్నారు. ఈ నవభారతంలో ఉన్న అందరికి అభినందనలు. ప్రతి ఒక్కరికి సంతోషం, విజయం చేకూరాలని కోరుకుంటున్నా. ఇదే నా చివరి ట్వీట్​ ఎందుకంటే నేను ట్విట్టర్​ నుంచి వైదొలుగుతున్నాను. ఎటువంటి భయం లేకుండా నా భావాలు వ్యక్తపరిచే స్వేచ్ఛలేనపుడు... మాట్లాడినా ఉపయోగం లేదు. గుడ్​బై "

-- అనురాగ్​ కశ్యప్​, బాలీవుడ్​ దర్శకుడు

ట్విట్టర్​ నుంచి వైదొలగిన అనురాగ్​

సామాజిక మాధ్యమాల వేదికగా తనదైన అభిప్రాయాలు చెప్పడం ద్వారా బాగా పేరుతెచ్చుకున్నాడు అనురాగ్​. సామాజిక అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తుంటాడు. ఇటీవల కొన్ని చోట్ల జరిగిన మూక దాడులను ప్రస్తావిస్తూ 49 మంది ప్రముఖులు ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇందులో కశ్యప్​ ఒకడు.

తన అభిప్రాయాలు పడని కొందరు అంతర్జాలం ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని గతంలోనూ ట్విట్టర్లో సందేశాలు పంచుకున్నాడీ హిందీ దర్శకుడు. జులైలో మోదీ లోక్​సభ ఎన్నికల్లో విజయం తర్వాత అభినందనలు తెలిపిన ఈ దర్శకుడు.. కొందరి నుంచి తన కుటుంబానికి ముప్పు ఉన్నట్లు పేర్కొన్నాడు.

ప్రస్తుతం అనరాగ్ కశ్యప్​... తాప్సీ, భూమి పడ్నేకర్​తో కలిసి 'సాంద్​ కీ ఆంఖ్​'​ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల్ని పలకరించనుందీ బయోపిక్​.

ఇవీచూడండి...'మోదీ మీరే చెప్పండి... ఎలా ఎదుర్కోవాలో​'

ABOUT THE AUTHOR

...view details