తెలంగాణ

telangana

By

Published : Jul 21, 2020, 2:00 PM IST

ETV Bharat / sitara

'స్టార్​లంతా ముందు సెట్​ వర్కర్లకు గౌరవం ఇవ్వండి'

బాలీవుడ్​లో నెపోటిజమ్​పై తీవ్ర చర్చలు కొనసాగుతున్న వేళ.. ప్రముఖ దర్శకుడు అనురాగ్​ కశ్యప్​ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. మొదట స్టార్​ నటులు తోటి కళాకారులు, సెట్​ వర్కర్లకు గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలని పేర్కొన్నారు.

Anurag Kashyap pitches in on nepotism debate, asks stars to give set workers due respect
అనురాగ్​ కశ్యప్​

సుశాంత్ సింగ్​ రాజ్​పుత్​ ఆత్మహత్యతో బాలీవుడ్​లో బంధుప్రీతిపై అగ్గి రాజేసుకుంది. ఈ క్రమంలోనే సామాజిక మాధ్యమాల వేదికగా ప్రముఖ సినీ తారల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా దర్శకుడు అనురాగ్​ కశ్యప్​ నెపోటిజమ్​తో పాటు, ఇన్​సైడర్స్​ వర్సెస్​ అవుట్​సైడర్స్​ గురించి వరుస ట్వీట్లతో మరో చర్చకు తెర లేపారు.

నెపోటిజమ్​ గురించి మాట్లాడుతున్న స్టార్​లంతా.. తమ సహ నటులు, సెట్​లో ఉండే స్పాట్​ బాయ్స్​, జూనియర్​ ఆర్టిస్టులు, టెక్నిషియన్స్​ను కనీసం పట్టించుకోరని పేర్కొన్నారు.

"ఫ్రెండ్స్​.. ప్రస్తుతం ఓ వింత చర్చ నడుస్తోంది. అయితే సినిమాల్లో నటులు మాత్రమే లేరు. కనీసం 150 మందికిపైగా సెట్స్​లో పని చేస్తారు. ఇన్​సైడ్​, అవుట్​ సైడర్స్​ ఎవరైనా కావచ్చు. తోటి కళాకారులు, కార్మికులు, స్పాట్​ బాయ్​లకు ఒకే గౌరవం ఇవ్వడం నేర్చుకున్న రోజు.. వారితో కలిసి మాట్లాడొచ్చు. మొదట ఏ నటుడు, దర్శకుడు వారితో అనుచితంగా ప్రవర్తించారో.. ఎవరు చిత్రీకరణ పని పూర్తిగా నిలిచిపోయేలా చేస్తున్నారో సెట్స్​లో పని చేసే వారిని అడగండి. ఆ తర్వాత నటీనటులు సెట్స్​పైకి వెళ్లండి. అంతే కాకుండా సహయ నటుల పాత ఇంటర్వ్యూలు చూడండి. వారు ఎందుకు ఫలానా సినిమా ఆఫర్​ను వదిలేసుకోవాల్సి వచ్చిందో వినండి. మీరు ఏ విధంగా ఇతరులతో ప్రవర్తిస్తారో.. అదే విధంగా ఇతరులు మీతో ప్రవర్తిస్తారు."

- అనురాగ్​ కశ్యప్​, సినీ దర్శకుడు.

వందలాది మంది కలిసి పని చేస్తేనే ఒక సినిమా పూర్తిగా బయటకు వస్తుందని.. ఆ కష్టాన్ని అర్థం చేసుకోవాలంటే ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని అనురాగ్​ పేర్కొన్నారు.

"ఒక సినిమా చేయడానికి వంద మందికిపైగా వారి రక్తం, చెమటను చిందిస్తారు. అయితే, ఇందులో న్యాయం, అన్యాయం విషయానికొస్తే.. సినిమా నుంచి ఎక్కువ లాభం పొందిన వారు సమస్యలను ఎందుకు లేవనెత్తుతారు?. మీరు నిజాన్ని అర్థం చేసుకోవాలంటే.. సమాజంలో ఉన్న ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలించి చూడాలి. ప్రపంచం మీ పనిని గుర్తించినప్పుడు.. ఒకరిద్దరి గురించి మీకెందుకు?" అని అనురాగ్​ తెలిపారు.

ఈ విధంగా తన మనసులో పాట చెప్పాలనిపించినట్లు ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు అనురాగ్​.

ABOUT THE AUTHOR

...view details