బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబం కరోనా వ్యాక్సిన్ తీసుకుంది. ఈ విషయాన్ని బిగ్బీ సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. అభిషేక్ మినహా తామంతా వ్యాక్సిన్ తీసుకున్నట్లు వెల్లడించారు.
"వ్యాక్సినేషన్ పూర్తయింది. అంతా బాగుంది. గురువారం నాతో పాటు కుటుంబం, సిబ్బంది అందరం కరోనా టెస్టు చేయించుకున్నాం. ఫలితం నెగెటివ్గా వచ్చింది. అందువల్ల ఈరోజు వ్యాక్సిన్ తీసుకున్నాం. అభిషేక్ తప్ప అందరం తీసుకున్నాం. అతను వేరే దగ్గర ఉన్నాడు. త్వరలోనే తిరిగి వస్తాడు."
-అమితాబ్ బచ్చన్, నటుడు
గతేడాది అమితాబ్తో పాటు అభిషేక్, ఐశ్వర్యా రాయ్, ఆరాధ్యలకు కరోనా పాజిటివ్ వచ్చింది. తర్వాత వీరంతా కోలుకుని షూటింగ్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం 'దాస్వీ' అనే సోషల్ కామెడీ చిత్రంలో నటిస్తున్నారు అమితాబ్. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ఆగ్రాలో జరిగింది.
ఇప్పటికే సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, షర్మిలా ఠాగూర్, ధర్మేంద్ర, హేమా మాలిని, మోహన్ లాల్, జితేంద్ర, కమల్ హాసన్, నాగార్జున, రోహిత్ శెట్టి, నీనా గుప్తా, రాకేశ్ రోషన్, జానీ లీవర్ కరోనా తొలి డోసు తీసుకున్నారు.