బాలీవుడ్లో మరో ఆసక్తికర కాంబినేషన్ వెండితెరపై సందడి చేయనుంది. అమితాబ్ బచ్చన్, ఇమ్రాన్ హష్మీ తొలిసారి ఓ సినిమాలో కలిసి నటిస్త్తున్నారు. మే 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగతుందని తెలిపింది చిత్ర యూనిట్. ఆనంది పండిత్ మోషన్ పిక్చర్స్, సరస్వతి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.రుమీ జాఫ్రే దర్శకత్వం వహిస్తున్నాడు.
మే 10న షూటింగ్ ప్రారంభిస్తాం. అమితాబ్, ఇమ్రాన్ హష్మీ కలిసి నటించడం చూడాలని చాలా ఆత్రుతగా ఎదురుచూస్తన్నాం. సినిమా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది.
-ఆనంద్ పండిత్, చిత్ర నిర్మాత