తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అమితాబ్, ఇమ్రాన్ హష్మీ.. ఓ మల్టీ స్టారర్

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, ఇమ్రాన్ హష్మీ కలయికలో ఓ సినిమా రూపొందనుంది. ఈ చిత్రానికి రుమి జాఫ్రే దర్శకత్వం వహించనున్నాడు

By

Published : Apr 11, 2019, 5:39 PM IST

అమితాబ్, ఇమ్రాన్

బాలీవుడ్​లో మరో ఆసక్తికర మల్టీస్టారర్​ చిత్రానికి రంగం సిద్ధమైంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఇమ్మాన్ హష్మీ ఓ సినిమాలో కలిసి నటించనున్నారు. వీరిద్దరు కలిసి నటించడం ఇదే మొదటిసారి. ఇంకా పేరు ఖరారు కానీ ఈ సినిమాకు రుమి జాఫ్రే దర్శకత్వం వహించనున్నాడు. మిస్టరీ థ్రిల్లర్​గా సినిమా తెరకెక్కనుంది.

"అత్యంత ప్రతిభ కలిగిన నటులతో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. చిత్రీకరణ ప్రారంభం కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నా".
- రుమి జాఫ్రే, దర్శకుడు

"అమితాబ్, నేను చాలా కాలంగా స్నేహితులం. అత్యంత ప్రతిభ గల నటుడు, నిర్ణయానికి కట్టుబడి ఉండే వ్యక్తి అమితాబ్. ఆయనతో సినిమా నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇమ్రాన్ హష్మీ పనితీరు బాగుంటుంది. వీరిద్దరితో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా".
- ఆనంద్ పండిట్, చిత్ర నిర్మాత

మే 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని 2020 ఫిబ్రవరి 21న విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది.

ఇవీ చూడండి.. సూర్య అభిమానులకు కానుక సిద్ధమైంది

ABOUT THE AUTHOR

...view details