బాలీవుడ్లో మరో ఆసక్తికర మల్టీస్టారర్ చిత్రానికి రంగం సిద్ధమైంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఇమ్మాన్ హష్మీ ఓ సినిమాలో కలిసి నటించనున్నారు. వీరిద్దరు కలిసి నటించడం ఇదే మొదటిసారి. ఇంకా పేరు ఖరారు కానీ ఈ సినిమాకు రుమి జాఫ్రే దర్శకత్వం వహించనున్నాడు. మిస్టరీ థ్రిల్లర్గా సినిమా తెరకెక్కనుంది.
"అత్యంత ప్రతిభ కలిగిన నటులతో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. చిత్రీకరణ ప్రారంభం కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నా".
- రుమి జాఫ్రే, దర్శకుడు