బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా టీకా రెండో డోసు తీసుకున్నారు. ఈ విషయాన్ని బిగ్బీ ఇన్స్టా ద్వారా తెలిపారు. 'రెండో డోస్ కూడా తీసేసుకున్నాను' అని వ్యాఖ్య రాసుకొచ్చారు.
బిగ్బీకి కరోనా టీకా రెండో డోసు - అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కరోనా వ్యాక్సిన్ రెండో డోసు స్వీకరించారు. ఇన్స్టాలో దీనికి సంబంధించిన ఫొటోను పోస్ట్ చేశారు.
బిగ్బీకి కరోనా టీకా
గతేడాది అమితాబ్తో పాటు అభిషేక్, ఐశ్వర్యా రాయ్, ఆరాధ్యలకు కరోనా పాజిటివ్ వచ్చింది. తర్వాత వీరంతా కోలుకుని షూటింగ్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం 'బ్రహ్మస్త్ర', 'బటర్ఫ్లై', 'మేడే', 'గుడ్బై' సహా పలు చిత్రాల్లో బిగ్బీ నటిస్తున్నారు. ఇప్పటికే బిగ్బీ ఫ్యామిలీ సహా సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, షర్మిలా ఠాగూర్, ధర్మేంద్ర, హేమా మాలిని, మోహన్ లాల్, జితేంద్ర, కమల్ హాసన్, నాగార్జున, రోహిత్ శెట్టి, నీనా గుప్తా, రాకేశ్ రోషన్, జానీ లీవర్ ఇంకా పలువురు నటులు కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు.