తెలంగాణ

telangana

By

Published : Nov 19, 2019, 6:31 PM IST

ETV Bharat / sitara

'హాట్​గానే ఉన్నా.. వాళ్లే పద్ధతిగా చూస్తున్నారు'

అ!, అరవింద సమేత వంటి చిత్రాల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నఅందాల భామ ఈషా రెబ్బా. తను తెలుగమ్మాయే అయినా ఎలాంటి పాత్రలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నానంటోందీ ముద్దుగుమ్మ. అంతేకాకుండా తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.

am so hot but they are seeing like decent said heroin eesha rebba

"తెలుగు అమ్మాయి అనగానే పల్లెటూరి చిత్రాలకే సరిపోతుంది. నటీనటులు కూడా చీరలు, చుడీదార్లు వంటి వస్త్రధారణలో కనపడటానికే ఇష్టపడతారని అంతా అనుకొని వారిపై ఓ ముద్ర వేసేస్తారు. నాకిప్పటి వరకు వచ్చిన పాత్రలు ఆ తరహాలోనివే. కానీ నటిగా నేనెలాంటి పాత్రలు చేయడానికైనా సిద్ధమే" అని చెప్పింది ఈషా రెబ్బా.

ఇప్పటివరకు 'అ!','అరవింద సమేత' వంటి చిత్రాల్లో నటిగా మెరిసిందీ అందాల భామ. ఇప్పుడు 'రాగల 24 గంటల్లో' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించబోతుంది. శ్రీనివాస రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈనెల 22న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించింది ఈషా.

'నేను హాట్​గానే ఉన్నా... వాళ్లే నన్ను పద్దతిగా చూస్తున్నారు'
  • "ఇలాంటి నాయికా ప్రాధాన్య చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. నాకు ఈ తరహా జోనర్​లో పనిచేయాలని ఎప్పట్నుంచో ఉంది. ఆ కల ఇప్పటికి నెరవేరినందుకు సంతోషంగా ఉంది. శ్రీనివాసరెడ్డి కథ చెప్పినప్పుడే నాకు చాలా నచ్చేసింది. మంచి సస్పెన్స్‌ థ్రిల్లర్‌. ఇందులో నా పేరు విద్య. ఈ పాత్ర కోసం శారీరకంగా, మానసికంగా చాలా కష్టపడ్డా. ఎందుకంటే నాయికా ప్రాధాన్య చిత్రమనగానే బాధ్యత అంతా మన భుజాలపైనే ఉంటుంది. కథ నా చుట్టూనే తిరుగుతుంటుంది కాబట్టి ఎక్కువ షూట్‌లో పాల్గొనాల్సి వచ్చేది. నా పాత్రలో కోపం, బాధ, భయం.. ఇలా అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయి. వీటిని పలికించడం కోసం మానసికంగా శ్రమ పడాల్సి ఉంటుంది. చిత్రీకరణలో ఈ అనుభవాలన్నింటినీ ఎంతో ఆస్వాదించా. నన్ను ఈ చిత్రంలో ఎంతో అందంగా చూపించారు."
  • "శ్రీనివాస్‌ కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఆయన 'ఢమరుకం' చేశారనే తెలుసు. ఆ తర్వాతే తెలిసింది. ఆయన ఎక్కువ కామెడీ జోనర్‌ చిత్రాలకు పనిచేశారని. ఆయనకు ఈ సినిమా తొలి థ్రిల్లర్‌ అయినా ఎంతో క్లారిటీతో తెరకెక్కించారు. కథలో ఉన్న మలుపులను ప్రేక్షకులెవ్వరూ ముందుగా ఊహించలేరు. చాలా ట్విస్ట్‌లు, సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. నాకు ఆయన కథ చెప్పినప్పుడు తర్వాత ఇలా జరుగుతుందేమో అని అనుకునేదాన్ని కానీ, నా అంచనాలకు ఎక్కడా ఆస్కారం ఉండేది కాదు. థ్రిల్లర్‌లకు ఉండాల్సిన ప్రధాన లక్షణం కూడా ఇదే కదా అనిపించింది. సత్యదేవ్‌ పాత్ర కూడా చాలా బాగుంటుంది. ఆయనది ప్రతినాయక ఛాయలున్న పాత్రే అయినప్పటికీ ప్రతినాయకుడు కాదు".
  • "తెలుగు అమ్మాయి కావడం వల్ల అవకాశాలు తక్కువ వస్తుండొచ్చు. కానీ ఆ ముద్ర నా కెరీర్‌కు ఎప్పుడూ ప్రతికూలంగా మారలేదు. అవకాశాల కోసం ఈ మధ్య హాట్‌ ఫొటోషూట్లు చేస్తున్నానేమో అనుకుంటున్నారు. అది వాస్తవం కాదు. నిజానికి నేనెప్పుడూ హాట్​గానే ఉంటాను. అన్నిరకాల దుస్తులు ధరించడానికి ఇష్టపడుతుంటా. నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలి అనుకుంటా. ఓ సినిమా ఎంచుకునేటప్పుడు కథ బాగుందా? దర్శకుడికి కథపై మంచి పట్టుందా లేదా? అన్నదే ఆలోచించి నిర్ణయం తీసుకుంటా. స్టార్‌ హీరోలతో చేసే అవకాశం వస్తే కాస్త కథ అటు ఇటుగా ఉన్నా ఒకే చేసేస్తా. ఎందుకంటే మనకి పేరొస్తుంది కదా (నవ్వుతూ). పరాజయాలకు కుంగిపోయే మనస్తత్వం కాదు నాది".
    'నేను హాట్​గానే ఉన్నా... వాళ్లే నన్ను పద్దతిగా చూస్తున్నారు'

'లస్ట్‌ స్టోరీస్‌'తో సంబంధం లేదు..

"నెట్‌ఫ్లిక్స్‌ నిర్మాణంలో 'లస్ట్‌ స్టోరీస్‌' వెబ్‌సిరీస్‌ చేస్తున్నా అనగానే అందరూ కియారా నటించిన భాగం చేస్తున్నా అని అనుకుంటున్నారు. నిజానికి ఆ సిరీస్‌కు దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఇందులో కనిపించే నాలుగు కథలు పూర్తిగా కొత్తవే. రెండిటికి నందిని రెడ్డి, తరుణ్‌ భాస్కర్‌ దర్శకులు. నేను చేస్తున్న భాగానికి సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. సత్యదేవ్, ఆషిమా నర్వాల్‌ ముఖ్యపాత్రలు పోషించారు. ఇప్పటికే నా భాగానికి సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. వచ్చే ఏడాది మార్చిలో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం తమిళంలో జి.వి.ప్రకాష్‌తో ఓ సినిమా చేస్తున్నా. కన్నడలోనూ ఓ చిత్రానికి సంతకం చేశాను. త్వరలో చిత్రీకరణ ప్రారంభమవుతుంది. తెలుగులోనూ ఓ కథ వింటున్నా... త్వరలో వివరాలు చెప్తా" అని చెప్పింది ఈషా రెబ్బా.

ఇది చదవండి: మలయాళ హిట్ రీమేక్​లో హీరో సుమంత్

ABOUT THE AUTHOR

...view details