తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అల్లు అర్జున్ 'బద్రీనాథ్​'కు పదేళ్లు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjjun) హీరోగా వీవీ వినాయక్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం 'బద్రీనాథ్' (Badrinath). ఈ సినిమా విడుదలై నేటికి పదేళ్లు గడిచాయి. ఈ సందర్భంగా ఈ సినిమాపై ప్రత్యేక కథనం.

By

Published : Jun 10, 2021, 4:50 PM IST

Badrinath
బద్రీనాథ్​

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjjun), తమన్నా జంటగా నటించిన చిత్రం 'బద్రీనాథ్' (Badrinath) . వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2011 జూన్ 10న విడుదలై ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాణ సారథ్యంలో వచ్చిన ఈ మూవీ విడుదలై నేటికి దశాబ్దం (10years for Badrinath) గడిచింది. ఈ నేపథ్యంలో ఈ మూవీని గుర్తుచేసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు అభిమానులు.

ఈ చిత్రంలో పొడగాటి జుట్టు, చారిత్రక దుస్తులు, కండలు తిరిగే దేహంతో కనిపించి అల్లు అర్జున్​ ఆకట్టుకున్నారు. తమన్నా తన అందచందాలతో ప్రేక్షకుల్ని అలరించింది. వినాయక్ మార్క్ యాక్షన్, అల్లు అరవింద్ భారీ బడ్జెట్​తో విజువల్స్ అదిరిపోయాయి. బద్రీనాథ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరపడం వల్ల సినిమాకు రిచ్ లుక్ వచ్చింది. అలాగే కీరవాణి అందించిన సంగీతం, బ్యాక్​డ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్​.

కథేంటంటే?
పురాతన హిందూ దేవాలయాలను ఉగ్రవాదుల నుండి రక్షించడానికి, మత గురువు, మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు భీష్మా నారాయణ్ (ప్రకాశ్ రాజ్) ఒక సైన్యాన్ని సిద్ధం చేస్తాడు. ఒక రోజు, అతని విద్యార్థులు కొందరు విష్ణు సహస్రనామం నుంచి కష్టమైన శ్లోకాన్ని పఠించడంలో విఫలమైనప్పుడు, బద్రి అనే చిన్న పిల్లవాడు అది చదవడం విని ఆశ్చర్యపోతాడు. భీష్మ బద్రి తల్లిదండ్రులను ఒప్పించి ఆశ్రమానికి తీసుకువెళతాడు. బద్రి సమర్థవంతమైన పోరాట యోధుడిగా బద్రీనాథ్ ఆలయాన్ని రక్షించడానికి బయలుదేరతాడు. అక్కడ అలకనంద (తమన్నా) అనే సందర్శకురాలిని చూస్తాడు. బద్రీనాథ్ చేరుకున్న తరువాత ఆమె తాత అనారోగ్యానికి గురవుతాడు. బద్రి అతన్ని నయం చేసి, వారందరినీ ఆలయానికి తీసుకువెళతాడు. ఈ క్రమంలోనే అలకనంద నాస్తికత్వం గురించి తాత భీష్మకు చెప్పి ఆమెను రక్షించమని కోరుతాడు. బద్రి అలకానందను రక్షించి, తన గురువు ఆదేశాల మేరకు, ఆమెకు శిక్షగా లక్ష దీపాలను వెలిగించాలని ఆదేశిస్తాడు. అసలు ఆమెకు దేవుడిపై నమ్మకం పోవడానికి గల కారణాన్ని వివరిస్తాడు తమన్నా తాత. భయంకరమైన డాన్ అయిన సర్కార్ భార్యను అవమానించిన తరువాత ఆమె జీవితం ప్రమాదంలో పడుతుంది. అందువల్ల ఆమెను బద్రీనాథ్​కు తీసుకురావలసి వచ్చిందని. ప్రతీకారం తీర్చుకోడంలో భాగంగా, అలకనంద తన కొడుకు నానిని పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేస్తుంది. అసలు విషయం తెలుసుకున్న బద్రి, భగవంతునిపై అలకానంద విశ్వాసాన్ని పునరుద్ధరిస్తానని వాగ్ధానం చేస్తాడు.

ఇదిలా ఉండగా ఉగ్రవాదులు అమరనాథ్ ఆలయంపై దాడి చేసి. దాని రక్షకుణ్ణి చంపేస్తాడు విలన్. భక్తులకు రక్షణగా భీష్మ, బద్రీని పంపిస్డతాడు. అతడు ఉగ్రవాదులందరినీ చంపేస్తాడు. ఈ క్రమంలోనే అలకనంద బద్రితో ప్రేమలో పడుతుంది. ఆమెకు దేవునిపై విశ్వాసం తిరిగి ఏర్పడుడుతుంది. ఆమె బద్రి తల్లిదండ్రులను కలుస్తుంది, అతని పట్ల తన ప్రేమ గురించి చెబుతుంది. వారు వారి పెళ్లికి అంగీకరిస్తారు. కాని బద్రీ తన వారసుడిగా ఉండాలని కోరుకుంటున్నానని, అతడు అవివాహితుడిగా ఉండాలని భీష్మ చెప్పినప్పుడు, మనసు విరిగిన అలకనంద మరోసారి తన విశ్వాసాన్ని కోల్పోవటం ప్రారంభిస్తుంది. ఆమెను తన ప్రేమికుడితో ఏకం చేస్తానని, ఆమె కోరిక నెరవేర్చడం కోసం బద్రీనాథుడికి అర్పించవలసిన బ్రహ్మ కమలం తెచ్చేందుకు ఆమెకు సాయం చేస్తాననీ బద్రి ఆమెకు చెబుతాడు. అయితే, తాను ప్రేమిస్తున్నది అతన్నేనని ఆమె చెప్పదు. బద్రిపై అలకనంద ప్రేమ ఏ తీరానికి చేరుతుంది, భీష్మ ఆమె ప్రేమకు అడ్డు తప్పుకుంటాడా, సర్కార్ మనుషులు అలకనందను ఏ కష్టాల పాలు చేస్తారు, బద్రి ఈ సమస్యలకు పరిష్కారాలు చూపించగలిగాడా అనేది మిగతా కథ.

ఇవీ చూడండి: Rhea Chakraborty: భారీ ప్రాజెక్టులో ఆధునిక ద్రౌపదిగా!

ABOUT THE AUTHOR

...view details