తెలంగాణ

telangana

'అల వైకుంఠపురములో' ట్రైలర్ వచ్చేసిందోచ్

By

Published : Jan 6, 2020, 9:27 PM IST

బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్​లో వస్తున్న 'అల వైకుంఠపురములో' ట్రైలర్​ను విడుదల చేశారు. ఆద్యంతం ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.

అల్లు అర్జున్-పూజా హెగ్డే
అల వైకుంఠపురములో ట్రైలర్

అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న 'అల వైకుంఠపురములో' సినిమా ట్రైలర్ వచ్చేసింది. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. టబు, సుశాంత్, నవదీప్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సోమవారం ఈ సినిమా మ్యూజికల్‌ నైట్‌ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు. బన్నీ అభిమానులు ఏం కోరుకుంటున్నారో వాటన్నింటినీ రంగరించి త్రివిక్రమ్‌ ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది.

ABOUT THE AUTHOR

...view details