తెలంగాణ

telangana

'అల వైకుంఠపురములో' మ్యూజికల్​ కన్సర్ట్​​ భారీ స్థాయిలో

By

Published : Jan 5, 2020, 4:31 PM IST

హైదరాబాద్​లో ఈ సోమవారం.. 'అల వైకుంఠపురములో' సినిమా మ్యూజికల్ కన్సర్ట్​ జరగనుది. ఇందులో ప్రముఖ గాయనీగాయకులు తమ గాత్రంతో అలరించనున్నారు.

'అల వైకుంఠపురములో' మ్యూజిక్​ కన్సర్ట్
'అల వైకుంఠపురములో' సినిమాలో అల్లు అర్జున్

'అల వైకుంఠపురములో' మ్యూజిక్​ కన్సర్ట్.. హైదరాబాద్​లోని యూసఫ్​గూడ పోలీస్​ గ్రౌండ్స్​లోసోమవారం జరగనుంది. 54 మంది ప్రముఖ గాయనీగాయకులు.. తన పాటలతో అలరించనున్నారు. సంబంధించిన పోస్టర్​ను చిత్రబృందం ఇప్పటికే పంచుకుంది.

'అల వైకుంఠపురములో' మ్యూజికల్ కన్సర్ట్​లో పాల్గొనే సింగర్స్, మ్యూజిషియన్స్

ఇందులో సంగీత దర్శకుడు తమన్, బిగ్​బాస్-3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, సిద్ శ్రీరామ్, అర్మాన్ మాలిక్, అనురాగ్ కులకర్ణి, శివమణి, ప్రియ సిస్టర్స్, లేడీ కస్, రాహుల్ నంబియర్, ఎమ్​జే 5 తదితరులు సందడి చేయనున్నారు. ఇది 'బిగ్గెస్ట్ ఎవర్ మ్యూజిక్ కన్సర్ట్' అంటూ ఇప్పటికే భారీ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు.

ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు జనవరి 12న రానుంది. అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లు. తమన్ సంగీతమందించాడు. త్రివిక్రమ్ దర్శకుడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్​ నిర్మించింది.

ఇది చదవండి: సంక్రాంతి కోసం మహేశ్​- బన్నీల మధ్య కుదిరిన రాజీ

ABOUT THE AUTHOR

...view details