బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్కుమార్ వరుస బయోపిక్లతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే 'కేసరి', 'మిషన్ మంగళ్'తో అలరించిన ఈ కథానాయకుడు.. చారిత్రక నేపథ్యమున్న జీవిత చరిత్రలో, 'పృథ్వీరాజ్ చౌహాన్' అనే రాజు పాత్రలో కనిపించనున్నాడు. సోమవారం తన 52వ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ను 'పృథ్వీరాజ్'గా ప్రకటిస్తూ.. వచ్చే ఏడాది దీపావళికి తెస్తున్నట్లు ట్వీట్ చేశాడు.
"అత్యంత ధైర్యంగా శత్రువుల్ని ఎదుర్కొన్న రాజుల్లో పృథ్వీరాజ్ చౌహాన్ ఒకరు. ఇలాంటి నిజమైన దేశభక్తుల్ని తప్పకుండా గుర్తుతెచ్చుకోవాలి. ఈ బయోపిక్స్తో రాబోయే తరాలు స్ఫూర్తి పొందుతాయి. నా పుట్టిన రోజున ఈ విషయం మీతో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది." -అక్షయ్ కుమార్, హీరో