తెలంగాణ

telangana

By

Published : May 14, 2021, 8:22 PM IST

ETV Bharat / sitara

కరోనా బాధితుల కోసం హీరో అజిత్ భారీ సాయం

అగ్రహీరో అజిత్ కుమార్.. తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి తన వంతు విరాళం అందించారు. రూ.25 లక్షల చెక్కును స్టాలిన్​కు అందజేశారు.

ajith gave 25 lakhs to tamil nadu cm relief fund
అజిత్

కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో రాష్ట్రాలన్నీ దాదాపు లాక్​డౌన్​లో పాటిస్తున్నాయి. ఏడాది కాలంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న ఈ వైరస్​ మూలంగా ప్రజలు రోజూ చనిపోతున్నారు. వారిని ఆదుకోవడంలో భాగంగా పలువురు సినీ కథానాయకులు తమ వంతు సాయం అందజేస్తున్నారు. ఇందులో భాగంగా హీరో సూర్య కుటుంబం, తమిళనాడు ప్రభుత్వానికి రూ.కోటి ఇవ్వగా, ఇప్పుడు తలా అజిత్ రూ.25 లక్షలు విరాళమిచ్చారు.

అజిత్ ప్రస్తుతం వాలిమై సినిమా చేస్తున్నారు. ఇందులో యువ నటుడు కార్తికేయ, ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. కొవిడ్ ప్రభావం తగ్గిన తర్వాత ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.

ABOUT THE AUTHOR

...view details