తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్ఎక్స్ 100' దర్శకుడితో అఖిల్!​ - అజయ్ భూపతి అఖిల్ అక్కినేని

అక్కినేని హీరో అఖిల్​ మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్​ ఈ మూవీని నిర్మించనుందని తెలుస్తోంది.

Akhil, Ajay
అఖిల్, అజయ్

By

Published : Apr 19, 2021, 3:02 PM IST

టాలీవుడ్​లో మరో క్రేజీ ప్రాజెక్టుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. అక్కినేని యువ హీరో అఖిల్​ కథానాయకుడిగా 'ఆర్ఎక్స్​ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుందని టాలీవుడ్​లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే అఖిల్​ను కలిసి అజయ్ కథను వినిపించాడట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' అనే చిత్రం చేస్తున్నాడు అఖిల్. అలాగే శర్వానంద్, సిద్దార్థ్​లతో 'మహాసముద్రం' తెరకెక్కిస్తున్నాడు అజయ్ భూపతి. ఈ చిత్రీకరణలు ముగిసిన తర్వాత అఖిల్-అజయ్ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details