తెలంగాణ

telangana

By

Published : Dec 17, 2020, 11:50 AM IST

Updated : Dec 17, 2020, 12:00 PM IST

ETV Bharat / sitara

గన్స్​తో వచ్చేసిన అడివి శేష్, విశాల్

మేజర్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మేజర్'. అడివి శేష్ టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్​లుక్ విడుదలైంది. అలాగే విశాల్, ఆర్య నటిస్తోన్న 'ఎనిమీ' చిత్రం నుంచి విశాల్ లుక్​ను రిలీజ్ చేసింది చిత్రబృందం.

Adivi Shesh major first look released
గన్స్​తో వచ్చేసిన శేష్, విశాల్

26/11 దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా 'మేజర్'. పాన్ ఇండియా కథతో తెరకెక్కిస్తుండగా, టాలీవుడ్​ నటుడు అడివి శేష్​ టైటిల్​ రోల్ చేస్తున్నారు. సూపర్​స్టార్ మహేశ్​బాబు ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈరోజు విజయ్ దివస్ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్​లుక్​ను విడుదల చేశారు.

శేష్

కోలీవుడ్​ హీరోలు విశాల్‌, ఆర్య కలిసి ఓ మల్టీస్టారర్​ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్​ను 'ఎనిమీ'గా ప్రకటించింది చిత్రబృందం. తాజాగా ఈ సినిమాలో విశాల్ లుక్​ను విడుదల చేశారు.

విశాల్
Last Updated : Dec 17, 2020, 12:00 PM IST

ABOUT THE AUTHOR

...view details