తెలంగాణ

telangana

By

Published : Feb 20, 2021, 10:10 PM IST

ETV Bharat / sitara

పవర్​ఫుల్​ పాత్రలో విజయశాంతి?

సీనియర్​ నటి విజయశాంతి త్వరలోనే ఓ పవర్​పుల్​ పాత్రలో నటించే అవకాశముంది. ఆమె కోసమే ప్రతిమా ఫిల్మ్స్ ప్రత్యేకంగా ఓ సరికొత్త కథను సిద్ధం చేశారని తెలిసింది.

vijaya
విజయశాంతి

తెలుగులో మహేష్‌బాబుతో కలిసి 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో ప్రొఫెసర్‌ భారతిదేవిగా నటించి అలరించారు విజయశాంతి. గతంలో ఆమె అగ్ర కథానాయకులైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లతో కలిసి ఎన్నో చిత్రాల్లో నాయికగా సందడి చేసిన ఆమె.. అనంతరం 'కర్తవ్యం', 'ఒసేయ్‌ రాములమ్మ'వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం విజయం తర్వాత ఆమెను చాలా మంది నిర్మాతలు తమ చిత్రాల్లో నటింపజేసేందుకు ముందుకొచ్చారు.

ఈ క్రమంలోనే విజయశాంతి కోసం ప్రతిమా ఫిల్మ్స్ ఓ సరికొత్త పవర్‌ఫుల్‌ కథను సిద్ధం చేసిందని సమాచారం. ఈ కథకు ఆమె అయితేనే సరిపోతారని భావిస్తున్నారట. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు. సినిమా షూటింగ్‌ అంతా కశ్మీర్‌ ప్రాంతంలోనే చిత్రీకరించనున్నారట. చిత్రానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాలంటే కొద్ది రోజుల పాటు ఆగాల్సిందే.

ఇదీ చూడండి: 'కిలాడి' విజయశాంతి.. 40 ఇయర్స్​ ఇండస్ట్రీ

ABOUT THE AUTHOR

...view details