తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తారల నోరు తీపి చేసిన పూజాహెగ్డే - Pooja Hegdey send Mangoes to cinistars

నటి పూజాహెగ్డే.. టాలీవుడ్​ నుంచి బాలీవుడ్​ వరకు పలువురు తారల నోరు తీపి చేసింది. వారందరికీ సహజ సిద్ధంగా పండించిన మామిడి పళ్లను పంపింది.

pooja hegdey
పూజా హెగ్డే

By

Published : May 17, 2021, 7:22 AM IST

Updated : May 17, 2021, 7:38 AM IST

సినీ ప్రముఖుల్లో చాలా మందికి వ్యవసాయం అంటే మక్కువ. వారు స్వయంగా పంటలు పండిస్తుంటారు. తమ పొలాల్లో పండిన పంటల్ని అప్పుడప్పుడు తోటి తారలకు, సన్నిహితులకు బహుమతిగా అందజేస్తుంటారు.

పవన్ కల్యాణ్ తన వ్యవసాయ క్షేత్రంలో పండిన మామిడిపళ్లను సినీ ప్రముఖులకు పంపుతుంటారు. అలా కథానాయిక పూజాహెగ్డే కొద్దిమంది తారలకు సహజ సిద్ధంగా పండించిన మామిడిపళ్లను పంపించింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా పలువురికి నోరు తీపి చేసింది.

కర్ణాటకలో తన స్నేహితులు పండించిన పంటను పెద్దయెత్తున కొనుగోలు చేసి మరీ వాటి రుచి చూపించిందట పూజా. ప్రకాష్​రాజ్​ అయితే మామిడితో పాటు, జావా ఆపిల్స్​ను కూడా కొద్దిమంది ప్రముఖులకు అందజేశారు. ఆయన వ్యవసాయ క్షేత్రంలోనే నివసిస్తూ పలు రకాల పంటలు సాగుచేస్తుంటారు.

ఇదీ చూడండి: కిక్కెక్కిస్తున్న కపిలాక్షి ఫొటోలు

Last Updated : May 17, 2021, 7:38 AM IST

ABOUT THE AUTHOR

...view details