తనదైన శైలి నటనతో తమిళ, తెలుగు సినీ ప్రేక్షకుల్ని అలరించిన నటి వరలక్ష్మి శరత్ కుమార్ సామాజిక మాధ్యమ ఖాతాలు హ్యాక్ అయ్యాయి. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించారు. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయని తెలిపారు. ఆ అకౌంట్లను సాధ్యమైనంత త్వరగా తిరిగి పొందుతానని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం వరలక్ష్మి తెలుగులో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న'క్రాక్'లో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.