తెలంగాణ

telangana

By

Published : Mar 14, 2020, 6:37 PM IST

Updated : Mar 14, 2020, 7:21 PM IST

ETV Bharat / sitara

వ్యాపారవేత్తను పెళ్లాడిన 'పరుగు' హీరోయిన్​

టాలీవుడ్​ హీరోయిన్​ షీలా.. చెన్నైకి చెందిన ఓ వ్యాపారవేత్తను వివాహమాడింది. ఈ మేరకు భర్తతో దిగిన ఓ ఫొటోను ఫేస్​బుక్​లో పోస్ట్​ చేసింది. ఈ అమ్మడు అల్లుఅర్జున్​ సరసన 'పరుగు' సినిమాలో నటించింది.

Actress shella kaur ties the knot with an bussiness man of chennai
వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న 'పరుగు' హీరోయిన్​

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన 'పరుగు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి షీలా. కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్న షీలా.. బుధవారం(మార్చి 11న) పెళ్లిపీటలెక్కింది. చెన్నైకి చెందిన ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఈ మేరకు భర్తతో దిగిన ఫొటోను ఫేస్‌బుక్‌ వేదికగా అభిమానులతో పంచుకుందీ అందాల భామ.

" పెళ్లిరోజు మాకెంతో ప్రత్యేకమైనది. పోల్చడానికి మించిన సమయం.. మా గుండె లోతుల్లోని సంతోషం.. మేమిద్దరం కలిసి నూతన జీవితం ఆరంభించే ఓ కొత్త రోజు"

- షీలా, కథానాయిక.

2006లో విడుదలైన 'సీతాకోకా చిలుక' సినిమాతో.. షీలా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఏడాది విడుదలైన 'రాజుభాయ్‌' సినిమాలో మంచు మనోజ్‌ సరసన నటించింది. కాకపోతే ఆ రెండు సినిమాలు షీలాకు ఆశించిన గుర్తింపు అందించలేకపోయాయి. అనంతరం 2008లో విడుదలైన 'పరుగు' సినిమాలో బన్నీ సరసన ఆడిపాడింది. ఈ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. 'పరుగు' చిత్రం తర్వాత వరుసగా ఎన్టీఆర్‌, రామ్‌, బాలకృష్ణ చిత్రాల్లో షీలా నటించింది. 2011లో విడుదలైన 'పరమ వీర చక్ర' సినిమా తర్వాత షీలా తెలుగు తెరకు దూరంగా ఉంది.

వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న హీరోయిన్​ షీలా

ఇదీ చూడండి : భార్యభర్తల్ని తల్లి కొడుకుల్ని చేసిన నెటిజన్

Last Updated : Mar 14, 2020, 7:21 PM IST

ABOUT THE AUTHOR

...view details