బాలీవుడ్ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్పై అత్యాచార ఆరోపణలు చేసిన నటి పాయల్ ఘోష్.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కేంద్రమంత్రి రామ్దాస్ అథవాలే చీఫ్గా ఉన్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో సోమవారం చేరింది.
రాజకీయాల్లోకి హీరోయిన్ పాయల్.. ఆ పార్టీలో చేరిక - రామ్ దాస్ అథవాలే పాయల్ ఘోష్
'రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా'లో చేరిన హీరోయిన్ పాయల్ ఘోష్.. అనురాగ్ కేసు విషయంలో మద్ధతుగా ఉన్న రామ్దాస్ అథవాలేకు ధన్యవాదాలు తెలిపింది.
![రాజకీయాల్లోకి హీరోయిన్ పాయల్.. ఆ పార్టీలో చేరిక Actress Payal Ghosh joins Republican Party of India](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9318341-837-9318341-1603712047152.jpg)
హీరోయిన్ పాయల్ ఘోష్
ఘోష్ రాకతో పార్టీ బలం పుంజుకుందని ఈ సందర్భంగా రామ్దాస్ చెప్పారు. త్వరలోనే అనురాగ్ అరెస్టు అవుతారని అన్నారు. ఈ క్రమంలోనే పాయల్ను పార్టీ మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా నియమించారు.
దేశ సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు పాయల్ చెప్పింది. అనురాగ్ కేసు విషయంలో తనకు మద్ధతుగా నిలిచిన అథవాలేకు ధన్యవాదాలు తెలియజేసింది.
Last Updated : Oct 26, 2020, 5:29 PM IST