తెలంగాణ

telangana

By

Published : Sep 10, 2020, 4:24 PM IST

Updated : Sep 10, 2020, 4:51 PM IST

ETV Bharat / sitara

నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఛైర్మన్​గా పరేశ్ రావల్

బాలీవుడ్ ప్రముఖ నటుడు పరేశ్ రావల్​ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఛైర్మన్​గా ఎంపికయ్యారు.

నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా చైర్మన్​గా పరేశ్ రావల్
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా చైర్మన్​గా పరేశ్ రావల్

బాలీవుడ్ ప్రముఖ నటుడు పరేశ్ రావల్​ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. తాజాగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకు ఛైర్మన్​గా ఎంపికయ్యారు. రాష్ట్రపతి భవన్ నుంచి ఈమేరకు ఉత్తర్వులు విడుదలయ్యాయి.ఈ ఇనిస్టిట్యూట్​కు ఛైర్మన్​గా ఎంపికవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు పరేశ్.

ఈ పదవి 2017 నుంచి ఖాళీగా ఉంది. తాజాగా ఈ పోస్ట్​కు ఎంపికైన రావల్​.. నాలుగేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ పదవి ఛాలెంజింగ్​గా ఉన్నప్పటికీ సరదాతో కూడుకున్నదని తెలిపారు. తనకు తెలిసిన రంగంలో ఇలాంటి గొప్ప బాధ్యతలు నిర్వర్తించడం సంతోషంగా ఉందని వెల్లడించారు.

'హేరా ఫేరి', 'అతిథి తుమ్​ కబ్ జావోగే', 'ఓ మై గాడ్ వంటి' చిత్రాలతో మెప్పించారు పరేశ్ రావల్. తెలుగులో 'శంకర్ దాదా ఎంబీబీఎస్' సినిమాలో తన నటనతో కడుపుబ్బా నవ్వించారు.

Last Updated : Sep 10, 2020, 4:51 PM IST

ABOUT THE AUTHOR

...view details