తెలంగాణ

telangana

గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​: మొక్కలు నాటిన నటుడు గౌతం రాజు

గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా నటుడు అశోక్​ కుమార్​ నుంచి ఛాలెంజ్​ స్వీకరించిన నటుడు గౌతం రాజు ఆయన నివాసంలో మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా... మొక్కలు నాటడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

By

Published : Oct 11, 2020, 7:03 PM IST

Published : Oct 11, 2020, 7:03 PM IST

గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​: మొక్కలు నాటిన నటుడు గౌతం రాజు
గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​: మొక్కలు నాటిన నటుడు గౌతం రాజు

చెట్లను నాటడం ప్రతి ఒక్కరి బాధ్యతని నటుడు గౌతం రాజు అన్నారు. సినీ నటుడు అశోక్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన ఆయన... అత్తాపూర్​లోని నివాసంలో తన కుమారుడు కృష్ణతో కలిసి మొక్కలు నాటారు.

సినీ నటీమణులు అన్నపూర్ణమ్మ , శ్రీ లక్ష్మి, దిల్లీ రాజేశ్వరి, సనకు... మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరారు. కార్యక్రమంలో అత్తాపూర్ కార్పొరేటర్ రావుల విజయ జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: గ్రీన్ ఛాలెంజ్: మొక్కలు నాటిన నటి, లోక్‌సభ ఎంపీ నవనీత్ కౌర్

ABOUT THE AUTHOR

...view details