బిగ్బీ అమితాబ్ బచ్చన్ ఇంట్లో జరిగే దీపావళి వేడుకను ఈసారి కరోనా దూరం చేసేసింది. ప్రతి ఏటా నిర్వహించే ఈ కార్యక్రమానికి ఎందరో ప్రముఖులు హాజరవుతారు. అయితే.. ఈసారి వైరస్ ప్రభావమున్న దృష్ట్యా పండగకు దూరంగా ఉండనున్నారు. ఈ విషయాన్ని అమితాబ్ కుమారుడు అభిషేక్ ధ్రువీకరించారు. తమ బంధువుల్లో ఒకరు చనిపోవడం కూడా వీటిని జరపకపోవడానికి కారణమని చెప్పారు. అభిషేక్ సోదరి శ్వేత అత్తయ్య ఇటీవలే మృతి మరణించారు.
"మా కుటుంబంలో మేం ఒకరిని కోల్పోయాం. దానికి తోడు కరోనా కలవరం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎవరైనా వేడుకలను ఎలా చేసుకోగలరు. ఇప్పుడు భౌతిక దూరమే మన ఆయుధం. కానీ, అది కూడా వైరస్ సోకకుండా కాపాడుతుందన్న నమ్మకం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో దీపావళి లాంటి పండగలు జరుపుకోవడం కష్టమే"