తెలంగాణ

telangana

By

Published : Jul 31, 2020, 9:49 AM IST

ETV Bharat / sitara

'మాపై ట్రోల్స్​ చేసే వారి ఆరోగ్యం బాగుండాలి'

సోషల్​మీడియాలో తనపై, తన తండ్రి అమితాబ్​పై వస్తున్న ట్రోల్స్​పై తాజాగా స్పందించాడు బాలీవుడ్​ నటుడు అభిషేక్​ బచ్చన్​. తమపై విమర్శలు చేసే వారి ఆరోగ్యం కూడా బాగుండాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

Abhishek Bachchan gives witty reply to insolent troll
'మాపై ట్రోల్స్​ చేసే వారి ఆరోగ్యం బాగుండాలి'

కరోనా వైరస్​ సోకి ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్​ నటులు అమితాబ్​ బచ్చన్​, అభిషేక్​ బచ్చన్​లపై సోషల్​మీడియాలో వస్తున్న ట్రోల్స్​పై జూనియర్​ బచ్చన్​ స్పందించాడు. "మీ నాన్నగారు కూడా ఆస్పత్రిలో ఉన్నారు. ఇపుడు మీకు తిండి ఎలా?" అని ఓ నెటిజన్​ అనగా.. "ఇద్దరం ఆస్పత్రిలో పడుకుని తింటున్నాం" అంటూ సమాధానమిచ్చాడు అభిషేక్. దీనికి ట్రోలర్ స్పందిస్తూ.. "త్వరగా కోలుకోండి సార్.. ఇలా పడుకుని తినే అదృష్టం అందరికీ ఉండదు" అంటూ రిప్లై ఇచ్చింది.

ట్విట్టర్​లో నెటిజన్లకు రిప్లే ఇచ్చిన అభిషేక్​ బచ్చన్​

దీనిపై అభిషేక్​ స్పందిస్తూ.. "ఏది ఏమైనా మా లాంటి పరిస్థితి మీకు రాకూడదని, మీరు సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నా." అని తెలిపాడు​.

జులై 11న చేసిన కొవిడ్​ పరీక్షల్లో అభిషేక్​, అమితాబ్​లకు కరోనా సోకిందని నిర్ధరణ అయ్యింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ముంబయిలోని నానావతి ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details