తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జోరు పెంచిన ఆది.. ఒకేసారి మూడు చిత్రాలు

యువ కథానాయకుడు ఆది సాయికుమార్ ఒకేసారి మూడు చిత్రాల్ని పట్టాలెక్కిస్తున్నాడు. ఈ యువ హీరో పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమాల వివరాలను ప్రకటించాయి ఆయా చిత్రబృందాలు.

By

Published : Dec 23, 2019, 2:41 PM IST

aadhi
ఆది

యువ కథానాయకుడు ఆది సాయికుమార్‌ జోరు పెంచాడు. ఒకేసారి మూడు చిత్రాల్ని పట్టాలెక్కించేస్తున్నాడు. ఇటీవలే 'ఆపరేషన్‌ గోల్డ్​ఫిష్' చిత్రంతో అలరించిన ఆది తన పుట్టిన రోజు కానుకగా అభిమానులకు ట్రిపుల్‌ ధమాకా ఇచ్చాడు.

అవేంటంటే.. శ్రీనివాస్‌ నాయుడు దర్శకత్వంలో 'శశి' అనే చిత్రం చేస్తున్నాడు. దీనికి సంబంధించి ఆది ఫస్ట్‌లుక్‌ విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్‌లో రెండు విభిన్న కోణాల్లో కనిపిస్తున్నాడు ఆది. మైక్‌ పట్టుకుని చిరు నవ్వు చిందిస్తూ పాడుతుండగా.. పక్కనే గుబురు గడ్డంతో పొడవాటి జుత్తుతో గంభీరంగా అరుస్తూ ఆసక్తి పెంచుతున్నాడు. ఈ చిత్రంలో కథానాయికగా సురభి ఎంపికైంది. హనుమాన్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఈ చిత్రం నిర్మితమవుతుంది.

మరో ఆసక్తి ప్రాజెక్టు మాధురి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందుతుంది. ఇదొక క్రైమ్‌ థ్రిల్లర్‌. శివశంకర్‌ దేవ్‌ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దీనికి సంబంధించిన లుక్‌ను విడుదల చేశారు. దేవాలయాలు, వాహనాలు, టవర్లు, చెట్లు.. ఇలా పరిసరాలన్నింటితో ఆది ముఖం దర్శనమిచ్చేలా డిజైన్‌ చేసిన పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంటుంది. వీటితోపాటు మహంకాళి మూవీస్‌ బ్యానర్‌లో 'ఆది 16' వర్కింగ్‌ టైటిల్‌తో మరోటి చేస్తున్నాడు. జీబీ కృష్ణ దర్శకుడు. త్వరలోనే ఇతర వివరాలు తెలియనున్నాయి.

ఇవీ చూడండి.. రష్మికను జడ్జ్​ చేయడం మానండి: రక్షిత్​

ABOUT THE AUTHOR

...view details