తెలంగాణ

telangana

By

Published : Mar 28, 2020, 10:03 AM IST

ETV Bharat / sitara

'మోసగాళ్లు' చిత్రీకరణ కోసం భారీ సెట్టింగ్​

మంచు విష్ణు హీరో, నిర్మాతగా.. జెఫ్రీ గీ చిన్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'మోసగాళ్లు'. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్​ షూటింగ్​ పూర్తయింది. త్వరలోనే విడుదల అవ్వాల్సిన చిత్రం.. కరోనా లాక్​డౌన్​ కారణంగా వాయిదా పడింది.

A Huge setting for filming of Manchu Vishnu's Moosagallu Movie
'మోసగాళ్లు' చిత్రీకరణ కోసం భారీ సెట్టింగ్​

మంచు విష్ణు వెండితెరపై కనిపించి చాలా కాలమే అయ్యింది. ఈ విరామం తర్వాత 'మోసగాళ్లు' అనే పాన్‌ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నాడు విష్ణు. కరోనా దెబ్బ తగలకుంటే ఈ వేసవిలోనే బాక్సాఫీస్‌ ముందుకు వచ్చి ఉండేదీ సినిమా. కానీ, ఇప్పుడీ మహమ్మారి దెబ్బకు చిత్రీకరణ దశలోనే ఆగిపోయింది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్‌ దాదాపు తుది దశకు చేరుకుంది. క్లైమాక్స్‌ చిత్రీకరణకు జరుగుతుండగానే లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్​ నిలిపివేసినట్లు మంచు విష్ణు తాజాగా ఓ ప్రకటనలో తెలిపాడు.

మంచు విష్ణు

"మోసగాళ్లు'కు సంబంధించిన క్లైమాక్స్‌ యాక్షన్‌ సీన్స్‌ చిత్రీకరణ పూర్తయింది. ఇందులో కీలకమైన ఐటీ ఆఫీస్‌ సీన్ల కోసం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతంలో రూ.3.5కోట్ల వ్యయంతో ఓ భారీ ఐటీ ఆఫీస్‌ సెట్‌ను నిర్మించాం. లాక్‌డౌన్‌ కారణంగా చిత్రీకరణను నిలిపివేశాం. ప్రస్తుతం దేశంలో ఉన్న కరోనా విపత్కర పరిస్థితి మెరుగయ్యాక షూటింగ్​ను కొనసాగిస్తాం."

- మంచు విష్ణు, కథానాయకుడు

కాజల్​ అగర్వాల్​

ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంతో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. విష్ణుకు జోడీగా కాజల్‌ నటిస్తుండగా.. బాలీవుడ్‌ సీనియర్‌ హీరో సునీల్‌ శెట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు. జెఫ్రీ గీ చిన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇదీ చూడండి.. అక్షయ్​కు డైలాగ్​ డెలివరీలో ప్రత్యేక శిక్షణ! ​

ABOUT THE AUTHOR

...view details