తెలంగాణ

telangana

By

Published : Jan 4, 2020, 7:00 AM IST

Updated : Jan 4, 2020, 9:29 AM IST

ETV Bharat / sitara

ఆ సినిమా 17 ఏళ్ల ప్రేమకు తీపిగుర్తు: జెనీలియా

చలాకీ మాటలు, చిలిపితనం కలగలిపిన హాసిని పాత్రలో ఎంతో మంది హృదయాలను గెల్చుకుంది బొమ్మరిల్లు నటి 'జెనీలియా'. ఈ అమ్మడు 2012 ఫిబ్రవరి 3న బాలీవుడ్​ నటుడు రితేశ్​ దేశ్​ముఖ్​ను పెళ్లాడింది. వీరిది ప్రేమ వివాహం. తమ ఇద్దరినీ కలిపింది ఓ సినిమా అని.. తాజాగా సామాజిక మాధ్యమాల్లో ఆ విశేషాలను పంచుకుంది జెనీలియా.

17 years Love Story: Tujhe Meri Kasam is Stepping Stone for Riteish and Genelia Love Journey
ఆ సినిమా 17 ఏళ్ల ప్రేమకు తీపిగుర్తు: జెనీలియా

బాలీవుడ్​ నటీనటుల్లో ప్రేమించుకొని పెళ్లి చేసుకొంటున్న వారిని ఇటీవలి కాలంలో చాలా మందినే చూస్తున్నాం. అయితే గతంలో జెనీలియా కూడా ఇదే తరహాలో నటుడు రితేశ్​ దేశ్​ముఖ్​ను వివాహమాడింది. వారిద్దరి మధ్య ప్రేమకు కారణం 'తుజే మేరి కసమ్'​ చిత్రమట. తాజాగా వారి పెళ్లిరోజున ఓ పోస్టు ద్వారా ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది జెన్నీ. " ఇది నా మొదటి చిత్రం నా హృదయాన్ని కదిలించింది" అనే ట్యాగ్‌లైన్‌తో వీడియోను షేర్​ చేసింది.

17 ఏళ్ల క్రితం ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను... ఉషాకిరణ్‌ మూవీస్‌ పతాకంపై ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు నిర్మించారు. కె.విజయ్‌ భాస్కర్‌ దర్శకుడు. 2003లో జనవరి 3వ తేదీన విడుదలై మంచి ఫలితాన్నే రాబట్టిందీ చిత్రం.

ఈ సినిమాతో మొదలైన పరిచయం ద్వారా 2012లో ప్రేమ పెళ్లి చేసుకొన్నారు రితేశ్​-జెనీలియా జోడీ. వీరికి రియాన్‌, రాహిల్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వివాహం తర్వాత సినిమాలకు దూరమైంది జెనీలియా.

2012లో 'నా ఇష్టం' సినిమా తర్వాత తెలుగుతెరపై కనిపించలేదు. 2018లో 'మౌళీ' అనే మరాఠి చిత్రంలో చిన్న పాత్రలో కనిపించడమే కాకుండా నిర్మాతగా వ్యవహరించింది.

Last Updated : Jan 4, 2020, 9:29 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details