వాట్సాప్ లేని మొబైల్ ఫోన్ను ఊహించగలమా?.. ఆ స్థాయిలో ఆ యాప్ వినియోగం పెరిగిపోయింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి అనేక సోషల్ మీడియా వేదికలు ఉన్నప్పటికీ.. వాటన్నింటిలోకెల్లా వాట్సాప్ ప్రత్యేకమనే చెప్పాలి. ఆన్లైన్ మెసేజింగ్ కోసం కొన్ని ఎన్నో ఉన్నప్పటికీ.. వాట్సాప్ను మించిన పాపులారిటీ దేనికీ లేదు. బంధువులు, మిత్రులు, సహోద్యోగులు.. ఇలా ఎవ్వరితోనైనా టచ్లో ఉండేందుకు వాట్సాప్ తప్పనిసరి.
యూజర్ల సౌకర్యార్థం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకువస్తోంది. ప్రస్తుతం అలాంటి మరొక ఫీచర్తో యూజర్ల ముందుకు రాబోతోంది. సమాచారాన్ని ప్రసారం చేయడానికి 'ఛానెల్స్' అనే ఫీచర్ను పరిక్షిస్తోంది వాట్సాప్ సంస్థ. వాట్సాప్ బీటా ఇన్ఫో అనే సంస్థ తాజా నివేదిక ప్రకారం.. స్టేటస్ ట్యాబ్కు 'అప్డేట్స్' అనే కొత్త పేరు పెట్టనుంది. ఇందులోనే వన్-టూ-మెనీ అనే కాన్సెప్ట్తో 'ఛానెల్స్'ను రూపొందిస్తోంది. అయితే, దీన్ని ఓ ఆప్షనల్ ఎక్స్టెన్ష్లా తీసుకువస్తోంది. ఇందులో యూజర్లు వారికి నచ్చిన ఛానెళ్ల హ్యాండిల్స్ను ఎంచుకోవచ్చు. దానికోసం 'ఫైండ్ ఛానెల్స్' క్లిక్ చేసి.. నచ్చిన ఛానెల్ను వెతుక్కోవాలి. అనంతరం.. ఫోన్ నంబర్ ఇతర సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమాచారం గోప్యతకు వాట్సాప్ హామీ ఇస్తుంది.