తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

చేతులు కడగకపోతే చెప్పేసే కృత్రిమ మేధ

ప్రస్తుతం కరోనాకు వ్యాక్సిన్​ లేని కారణంగా మాస్క్​ ధరించడం, చేతులు కడుక్కోవడం తప్పనిసరి. అయితే కొందరు వాటిని నిర్లక్ష్యం చేస్తూ వ్యాధి వ్యాప్తికి కారణమవుతున్నారు. ఈ నేపథ్యంలో జపాన్​లోని ఓ ఐటీ సంస్థ.. చేతుల శుభ్రతను పరీక్షించేందుకు కృత్రిమ మేధ సాయం తీసుకుంటోంది.

By

Published : Jun 20, 2020, 5:05 PM IST

Updated : Feb 16, 2021, 7:51 PM IST

Japan's IT firm Fujitsu
చేతులు కడగకపోతే చెప్పేసే కృత్రిమ మేధ..

కరోనా వ్యాప్తి నేపథ్యంలో రెస్టారెంట్లు, ఫుడ్​కోర్టులకు వెళ్లేవారి సంఖ్య తగ్గింది. పార్శిల్​ సర్వీసులకే మొగ్గుచూపాలని ప్రభుత్వాలు సూచించినా వినియోగదారుల్లో ఎక్కడో భయం. వండేటప్పుడు చేతులు కడుక్కున్నారా? ప్యాకింగ్​ సమయంలో పరిశుభ్రత పాటించారా? అనే అనుమానాలు రాకమానవు.

చేతులు 20 సెకన్ల పాటు సబ్బుతో కడుక్కుంటేనే క్రిములు పోతాయని ఇప్పటికే స్పష్టం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లూహెచ్​ఓ). అయితే జపాన్​లో ఈ నిబంధనను కొందరు పెడ చెవిన పెట్టడం వల్ల మళ్లీ కేసులు సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ దేశానికి చెందిన ఓ ఐటీ సంస్థ ఫుజిట్సూ.. కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్​ ఇంటిలిజెన్స్​)తో కూడిన మానిటర్​ను తయారు చేసింది.

ఇది హెల్త్​కేర్​ సంస్థలు, హోటళ్లు, ఫుడ్​ పరిశ్రమలు, పలు సంస్థల్లో వర్కర్ల చేతులను మానిటైజ్​ చేసేందుకు ఉపయోగపడనుంది. చేతులు సరిగ్గా కడగకపోయినా, సబ్బు వాడకపోయినా చేప్పేస్తుంది.

ఆరు సూత్రాలు పక్కా...

చేతులు కడుక్కోవటానికి డబ్లూహెచ్​ఓ ఆరు సూత్రాలు జారీ చేసింది. అరచేతిని శుభ్రం చేసుకోవడం, బొటనవేళ్లు, చేతి మండలు, వేళ్ల సందులు, మణికట్టు చుట్టూ కడగటం, గోర్లు శుభ్రపరచుకోవడం ఇందులో భాగం. వాటన్నింటిని ఇది పరిశీలిస్తుంది. అంతేకాకుండా ఈ ఆరు సూత్రాలు పాటించని వారిని గుర్తించి సమాచారం భద్రపరుస్తుంది. ఫలితంగా యాజమాన్యాలు వారిపై చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే 2వేల యంత్రాలను తయారుచేసి వాటిని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది ఫుజిట్సూ.

ఆరు సూత్రాలు

కరోనా బారి నుంచి తప్పించుకునేందుకు ఆహార పరిశ్రమలో ఇది కీలకం కానుందని తయారీదారులు చెప్తున్నారు.

ఇదీ చూడండి: గుడ్​న్యూస్​: కరోనాకు భారత్​లో డ్రగ్ రిలీజ్

Last Updated : Feb 16, 2021, 7:51 PM IST

ABOUT THE AUTHOR

...view details