దేశీయంగా స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, హెడ్సెట్లు మినహా స్మార్ట్ డివైజ్ల వినియోగం అంతంత మాత్రంగానే ఉండేది. అయితే ఇటీవల స్మార్ట్ డివైజ్ల వినియోగం కూడా పెరుగుతోంది. లాక్డౌన్లో చాలా మంది ఇంట్లోనే ఉండటం, వర్క్ ఫ్రం హోం వంటివి చేస్తుండటం వల్ల.. వీటి వినియోగం ఎక్కువైంది. ఇలా ప్రస్తుతం ఎక్కువగా వినియోగిస్తున్న, ఉపయోగకరమైన పలు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) డివైజ్ల గురించి తెలుసుకుందాం.
యాపిల్ హోమ్ పాడ్ మినీ
హోం పాడ్ మినీ స్పీకర్.. యాపిల్ ఎస్5 చిప్సెట్తో పని చేస్తుంది. ఇందులో పుల్ రేంజ్ డ్రైవర్స్, పెయిర్ ఆఫ్ ఫోర్స్ వంటివి ఉన్నాయి. ఫోర్స్ క్యాన్సెలింగ్ పాసివ్ రేడియేటర్స్ ఉండడం వల్ల స్పష్టమైన బేస్ సౌండ్ వస్తుంది. ఈ స్పీకర్లో కొత్తగా ఇంటర్కామ్ ఫీచర్ను పొందుపరిచింది యాపిల్. దీని ద్వారా ఇంట్లోనే వేర్వేరు గదుల్లో ఉన్న వారికి సందేశాలు పంపించే వీలుంది.
రియల్మీ స్మార్ట్ క్యామ్..
ఇది 360 డిగ్రీలు రికార్డ్ చేసే హోం సెక్యురిటీ కెమెరా. ఇందులో కృత్రిమ మేధతో పని చేసే సెన్సార్లను పొందుపరిచింది రియల్మీ. దీనితో గదిలో ఏవైనా అనుమానాస్పద కదలికలు ఉంటే.. వెంటనే యూజర్లను అలర్ట్ చేస్తుంది. ఇందులో నైట్ విజన్ మోడ్ కూడా ఉంది. దీని ద్వారా రాత్రి పూట స్పష్టంగా వీడియో రికార్డ్ చేయగలదు. ఈ కెమెరాలో మైక్రో ఎస్డీ కార్డ్ సపోర్ట్.. 128 జీబీ వరకు రికార్డింగ్ సదుపాయాలు ఉన్నాయి.