దేశీయ మొబైల్ తయారీ కంపెనీ మైక్రోమ్యాక్స్ సరికొత్త మొబైల్స్తో మార్కెట్లోకి త్వరలో అడుగుపెట్టబోతోంది. 'ఇన్' సిరీస్లో స్మార్ట్ఫోన్లను తీసుకురాబోతున్నట్లు కంపెనీ ఇది వరకే తెలిపింది. తాజాగా వాటిని తీసుకురాబోయే తేదీని వెల్లడించింది. నవంబర్ 3న మధ్యాహ్నం 12 గంటలకు 'ఇన్' సిరీస్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా ఆ కంపెనీ ఓ టీజర్ను పంచుకుంది. వర్చువల్గా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
అయితే.. ఎన్ని ఫోన్లు తీసుకురాబోతున్నారు? ధర ఎంత ? వంటి వివరాలేవీ వెల్లడించలేదు.