కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో విద్యార్థులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ పరిస్థితుల్లో కోట్లాది మంది విద్యార్థులు ఆన్లైన్ ద్వారా పాఠాలు నేర్చుకుంటున్నారు. అలాంటి వారికి అనువుగా ఉండేలా సాంకేతిక దిగ్గజం గూగుల్ సరికొత్తగా 'ది ఎనీవేర్ స్కూల్' అనే సదుపాయాన్ని ఆవిష్కరించింది.
గూగుల్ మీట్, క్లాస్ రూమ్, జీ సూట్ వంటి అప్లికేషన్లలో 50 కొత్త ఫీచర్స్ను అందుబాటులోకి తెచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో గూగుల్ వినియోగదారుల కోసం దీన్ని ప్రవేశపెట్టింది. సెప్టెంబర్లో గూగుల్ మీట్లో కొత్త అప్డేట్స్ రానున్నాయి. 49 మంది వరకు ఒకేసారి కనిపించేలా 'ఇంటిగ్రేటెడ్ జామ్ బోర్డు- వైట్ బోర్డు' ఫీచర్ను కూడా తీసుకురానుంది.
మరిన్ని ఫీచర్లతో..
అక్టోబర్ నాటికి కొత్త కంట్రోల్స్ను కూడా వినియోగదారులకు అందించనుంది.
- వినియోగదారులు ముందే జాయిన్ కావచ్చు. అందరికీ ఒకేసారి తరగతులను నిర్వహించవచ్చు. ఒకేసారి కట్ చేయవచ్చు. ఇన్ మీటింగ్ చాట్ను డిసేబుల్ చేయవచ్చు.
- గూగుల్ మీట్లో కస్టమ్, బ్లర్డ్ బ్యాక్ గ్రౌండ్స్ సదుపాయాన్ని కల్పించనుంది. విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రైవసీ కోసం ఈ ఫీచర్ను అభివృద్ధి చేస్తోంది.
- బ్రేక్ ఔట్ రూమ్స్, అటెండెన్స్ ట్రాకింగ్ లాంటి ఫీచర్ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది.
- తరగతులను తాత్కాలికంగా రికార్డు చేసుకునే ఫీచర్ను కూడా ప్రవేశపెడుతోంది.