తెలంగాణ

telangana

చందమామ నమూనాల బరువు 1,731 గ్రాములు

By

Published : Dec 20, 2020, 6:02 AM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

చంద్రుని ఉపరితంలం నుంచి చాంగే-5 వ్యోమనౌక తెచ్చిన నమూనాలు 1,731 గ్రాముల బరువు ఉన్నాయని అధికారులు తెలిపారు. వీటిపై విస్తృత పరిశోధనలు జరపనున్నారు శాస్త్రవేత్తలు. ఈ మట్టి నమూనాలను ఇతర దేశాల అంతరిక్ష సంస్థలతోనూ పంచుకుంటామని చైనా ఇప్పటికే ప్రకటించింది.

moon china
చందమామ నమూనాల బరువు 1731 గ్రాములు

చందమామ నుంచి చాంగే-5 వ్యోమనౌక తెచ్చిన మట్టి, రాతి నమూనాలను చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ (సీఎన్ఎస్ఏ) అధికారులు పరిశీలించారు. వాటి బరువు 1,731 గ్రాముల మేర ఉందని తేల్చారు. రెండు కిలోల నమూనాలను సేకరించాలన్నది వాస్తవ ప్రణాళిక.

జాబిల్లి మట్టి, రాళ్లను సీఎన్ఎస్ఏ శనివారం శాస్త్రవేత్తల బృందాలకు అందించింది. వీటిపై విస్తృత స్థాయిలో పరిశోధనలు సాగుతాయి. తద్వారా జాబిల్లి అంతర్భాగ నిర్మాణం గురించి మరిన్ని వివరాలను వెలుగులోకి తీసుకురావాలని పరిశోధకులు తలపోస్తున్నారు. ఈ మట్టి నమూనాలను ఇతర దేశాల అంతరిక్ష సంస్థలతోనూ పంచుకుంటామని చైనా ఇప్పటికే ప్రకటించింది.

ఇదీ చదవండి:భూమిని చేరిన చంద్రుని మట్టి నమూనాలు

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details