భారీ అంచనాల నడుమ.. భారత్లో టెక్ దిగ్గజం యాపిల్ ఆన్లైన్ స్టోర్ను బుధవారం ప్రారంభించింది. దీనితో భారత వినియోగదారులు నేరుగా యాపిల్ ఉత్పత్తులను.. అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది.
ఇప్పటివరకు యాపిల్ ఉత్పత్తులను థర్డ్ పార్టీ రీసెల్లర్లు, ఈ-కామర్స్ సైట్లలో కొనేందుకు వీలుంది.
దేశంలో ఆన్లైన్ స్టోర్ను ప్రారంభించిన నేపథ్యంలో యాపిల్ ఉత్పత్తుల విక్రయానికి పలు ఆకర్షణీయమైన ఆఫర్లు తీసుకొచ్చింది.
క్యాష్బ్యాక్..
ఆన్లైన్ స్టోర్ ప్రారంభం సందర్భంగా.. యాపిల్ వినియోగదారులకు ప్రత్యేక క్యాష్బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. రూ.20,900లకు పైగా జరిపే కొనుగోలులకు 6 శాతం (గరిష్ఠంగా 10,000) క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. అయితే హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ ద్వారా జరిపే చెల్లింపులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అక్టోబర్ 16 వరకు ఒక కార్డుకు ఒకసారి మాత్రమే ఆఫర్ వర్తిస్తుందని యాపిల్ తెలిపింది.
మల్టిపుల్ పేమెంట్స్, ఈఎంఐ సదుపాయాలు..
యాపిల్ ఆన్లైన్ స్టోర్లో చెల్లింపులకు క్రెడిట్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ, రూపే కార్డ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ఆన్ డెలివరీ వంటి సదుపాయాలు ఉన్నాయి. నో-కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది. తమ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డు ఆధారంగా ఈఎంఐలను లెక్కించుకునేందుకు యాపిల్ వెబ్సైట్లో ప్రత్యేక సదుపాయం ఉంది.
అన్ని రకాల ఉత్పత్తుల ఆర్డర్లను ఉచితంగా, కరోనా నేపథ్యంలో కాంటాక్ట్లెస్గా చేయనున్నట్లు స్పష్టం చేసింది.
ఎక్స్ఛేంజ్ ఆఫర్..
యాపిల్ వెబ్సైట్ ద్వారా కొత్త ఐఫోన్ కొనాలనుకునే వారికి ఎక్స్ఛేంజి ఆఫర్ను తీసుకొచ్చింది. ఐఫోన్తో పాటు ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లోనూ ఈఎంఐ సదుపాయం వినియోగించుకునే వీలుంది.
ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్ మోడల్కు గరిష్ఠంగా రూ.35,000, ఐఫోన్ ఎక్స్ఆర్ మోడల్కు రూ.24,000 ట్రేడ్ ఇన్ వ్యాల్యూ ఇస్తోంది యాపిల్. ఏ బ్రాండ్లు, మోడళ్లు ఈ ఆఫర్ కిందకు వస్తాయో.. పూర్తి జాబితా యాపిల్ వెబ్సైట్లో ఉంది.