చైనాకు చెందిన ప్రీమియం స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ వన్ప్లస్.. త్వరలో హై-ఎండ్ ఫోన్ను విడుదల చేయనున్నట్లు సమాచారం. నార్డ్ 2 లేదా నార్డ్ సీఈ 5జీ పేరుతో జూన్ మధ్యలో ఇది లాంచ్ అయ్యే అవకాశమున్నట్టు తెలుస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1200 చిప్సెట్తో పాటు.. డిస్ప్లేకు సంబంధించి అదిరిపోయే ఫీచర్లతో ఈ మోడల్ రానున్నట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయాన్ని సంస్థ ధ్రువీకరించాల్సి ఉంది.
గత ఏడాది జులైలో మిడ్-రేంజ్ స్నాప్డ్రాగన్ 765జీ చిప్సెట్ కలిగిన నార్డ్ సిరీస్ను వన్ప్లస్ విడుదల చేసింది. ఈ క్రమంలోనే అప్గ్రేడ్ వెర్షన్ డైమెన్సిటీ 1200 చిప్సెట్ను డిజైన్ చేసినట్లు సమాచారం.