ఆండ్రాయిడ్ వినియోగదారులు టోల్ ఫ్రాడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. ఈ మాల్వేర్ వైఫై కనెక్షన్ను ఆఫ్ చేసి మొబైల్లోని నగదును ఖాళీ చేస్తుందని హెచ్చరించింది. బిల్లింగ్, కాల్ ఫ్రాడ్ కన్నా టోల్ ఫ్రాడ్ ప్రమాదకరమని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ 365 డిఫెండర్ రీసెర్చ్ టీం నివేదిక ప్రకారం.. ఎస్ఎమ్ఎస్ ఫ్రాడ్, కాల్ ఫ్రాడ్లు సాధారణంగా మెసేజ్, కాల్స్ చేసి వదిలేస్తాయి. కానీ ఈ టోల్ ఫ్రాడ్ నిరంతరం దాడులు చేస్తూ మాల్వేర్ను మెరుగుపరుస్తూనే ఉంటుంది.
ఈ మాల్వేర్ తన కార్యకలాపాల కోసం సెల్యూలార్ కనెక్షన్ను డిఫాల్ట్గా వినియోగించుకుంటుంది. వైఫై కనెక్షన్ను వాడుతున్నా మొబైల్ నెట్వర్క్కు బలవంతంగా కనెక్ట్ చేసేలా చేస్తుంది. మాల్వేర్ లక్ష్యంగా ఎంచుకున్న నెట్వర్క్తో అనుసంధానం అయ్యాక సులభంగా సమాచారాన్ని దొంగిలిస్తుంది. వినియోగదారుడి అనుమతి లేకుండానే ఓటీపీలను సైతం తీసుకుంటుంది. ఫ్రాడ్ జరగకుండా రక్షించే సబ్స్క్రిప్షన్లు పొందినా.. వాటి నుంచి మెసేజ్లు రాకుండా ఈ మాల్వేర్ అడ్డుపడుతుంది. డైనమిక్ కోడ్ లోడింగ్ను ఉపయోగించడం వల్ల మొబైల్ భద్రతా సమస్యను పరిష్కరించకుండా కష్టతరం చేస్తుంది.
"కొన్ని నిర్దిష్ట నెట్వర్క్ ఆపరేటర్ల వినియోగదారులపై మాల్వేర్ ప్రవర్తన ఎలా ఉంటుందని మేము పరిశోధన చేశాం. నెట్వర్క్లోకి మాల్వేర్ వచ్చినట్లైతే తన ఫ్రాడ్ కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉంటుంది. ఈ మాల్వేర్ ముప్పును తగ్గించడానికి ఆండ్రాయిడ్ ఏపీఐ నిబంధనలు, గూగుల్ ప్లే స్టోర్ పబ్లిషింగ్ పాలసీని ఉపయోగిస్తాము."