తెలంగాణ

telangana

By

Published : Mar 7, 2021, 6:00 PM IST

Updated : Mar 8, 2021, 11:46 AM IST

ETV Bharat / science-and-technology

జాక్​ డోర్సీ తొలి ట్వీట్​కు రూ.18.30 కోట్లు!

ట్విట్టర్​ సీఈఓ జాక్ డోర్సీ మొదటి ట్వీట్​ కొనుగోలుకు భారీ బిడ్ దాఖలైంది. 'వాల్యుయబుల్స్‌ బై సెంట్‌' వెబ్‌సైట్‌లో తన తొలి ట్వీట్​ను జాక్​ డోర్సీ స్వయంగా అమ్మకానికి పెట్టగా.. దానిని సొంతం చేసుకునేందుకు ఓ ఔత్సాహికుడు రూ.18.30 కోట్లు ఇచ్చేందుకు ఆసక్తి చూపారు.

High bid for Jack Dorsey first tweet
జాక్​ డోర్సే మొదటి ట్వీట్​కు భారీ బిడ్​

నిత్యం ఉరుకులు పరుగులతో తీరిక లేని జీవితం గడుపుతున్న మనుషులకు కబుర్లు చెప్పేందుకు వచ్చిన చిరు పిట్ట ట్విట్టర్‌. మరి ఆ కబుర్ల టెక్‌ పక్షి తెచ్చిన తొలి ట్వీట్‌ ఏంటో తెలుసా? ''జస్ట్‌ సెట్టింగ్‌ అప్‌ మై ట్విట్టర్‌'' అంటూ తొలిసారి మనందరినీ పలకరించింది. ట్విట్టర్‌ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సీ మార్చి 21, 2006లో ఆ ట్వీట్‌ చేశారు.

ఇప్పుడు అందరి జీవితాల్లో భాగమైన ట్విట్టర్‌లో తొలి ట్వీట్‌ అంటే ప్రత్యేకమేగా మరి. అందుకే దీన్ని జాక్‌ డోర్సీ 'వాల్యుయబుల్స్‌ బై సెంట్‌' వెబ్‌సైట్‌లో అమ్మకానికి పెట్టారు. ఈ విషయాన్ని శుక్రవారం ఆయన ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. ఇప్పటి వరకు లక్షల మంది ట్వీట్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేస్తూ బిడ్లు దాఖలు చేశారు. అత్యధికంగా 2.5 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.18.30 కోట్లు) ఇచ్చేందుకు ఓ ఔత్సాహికుడు ముందుకు వచ్చారు.

జాక్ డోర్సే మొదటి ట్వీట్​

ఈ ట్వీట్‌ను కొనుగోలు చేసిన వారికి ట్విట్టర్‌ సీఈఓ డిజిటల్‌గా వెరిఫై చేసి, సంతకం చేసిన ఓ ధ్రువపత్రాన్ని అందజేస్తారు. ఆ పత్రంలో ట్వీట్‌తో పాటు అది పోస్ట్‌ చేసిన సమయం వంటి వివరాలు ఉంటాయి.

ఇదీ చదవండి:బీపీసీఎల్, ఎయిరిండియాలతో ప్రైవేటీకరణ ప్రక్రియకు శ్రీకారం

Last Updated : Mar 8, 2021, 11:46 AM IST

ABOUT THE AUTHOR

...view details