తెలంగాణ

telangana

By

Published : Sep 11, 2020, 5:49 PM IST

ETV Bharat / opinion

చైనాతో వాణిజ్య బంధం తెంచుకోవడం సులువు కాదా?

భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరుపక్షాలు దేశ భద్రతను తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో చైనాతో వాణిజ్య యుద్ధానికి తెరతీసింది భారత్​. చాలా రంగాల్లో చైనా ఉత్పత్తులే కీలకంగా ఉన్నప్పటికీ.. స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా భారత్​ అడుగులేస్తోంది. ఈ అంశాలన్నింటిపై తన అభిప్రాయాన్ని ఈటీవీ భారత్​తో పంచుకున్నారు రిజర్వు బ్యాంకు​ మాజీ డిప్యూటీ గవర్నర్​ రమా సుబ్రహ్మణ్యం.

former RBI deputy governor Rama Subramaniam
చైనాతో సంబంధాలు తెంచుకోవడం అంత సులభం కాదా..?

భారత్-చైనా సరిహద్దుల వెంబడి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం... ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే మోదీ ప్రభుత్వం అందుకు తగ్గ వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే ఆ దేశాల దిగుమతులను తగ్గించుకుంటోంది. అయితే ఈ నిర్ణయంపై ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్​ రమా సుబ్రహ్మణ్యం గాంధీ తన అభిప్రాయాలను వెల్లడించారు. పాలసీలో మార్పులు, ప్రణాళికలను ఏళ్లపాటు అమలు చేస్తేనే.. చైనా నుంచి వేరుపడి ఆర్థికంగా నిలబడగలమని పేర్కొన్నారు. ఒక్కరోజులో చైనాతో సంబంధాలు తెంచేసుకోవడం వీలు పడదని తెలిపారు.

" చైనాతో వాణిజ్య సంబంధాలను తెంచేసుకోవడం సులభం కాదు. దిగుమతులు, ఎగుమతుల పరంగా చైనాతో ఈ రకంగా పరస్పర సంబంధాలు నెలకొల్పడానికి ఎన్నో ఏళ్లు పట్టింది. మనం చైనాకు ఎగుమతులు, దిగుమతులు గణనీయంగా చేసుకుంటున్నాం. ఒక్కరోజులో దాన్నెలా పాడుచేస్తారు?".

--రమా సుబ్రహ్మణ్యం గాంధీ, ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్​

చైనాపైనే ఆధారం..

ఇరుదేశాల మధ్య వాణిజ్యాన్ని చూస్తే చైనాకే ఎక్కువ లాభం కలుగుతోంది. గతేడాది రెండు దేశాల మధ్య 87 బిలియన్​ డాలర్ల ద్వైపాక్షిక వ్యాపారం జరిగింది. ఇందులో 70.3 బిలియన్​ డాలర్లను వస్తు, సేవల రూపంలో భారత్​కు దిగుమతులు జరగ్గా... 16.75 బిలియన్​ డాలర్ల ఎగుమతులు మాత్రమే భారత్​ చేయగలిగింది. అంటే 53.55 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటుతో ఉంది భారత్​.

చైనా నుంచి వంద శాతం దిగుమతులు ఉండగా.. భారతదేశం నుంచి ఎగుమతులు మాత్రం పావు వంతు జరుగుతున్నాయి. భారత్​కు.. 2013-14 నుంచి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనా మాత్రమే. 2018-19 నుంచి అమెరికా ఆ స్థానాన్ని ఆక్రమించింది.

ముందే ప్రణాళికలు..

జూన్​లో జరిగిన గల్వాన్​ ఘర్షణకు ముందే మోదీ ప్రభుత్వం పలు నిబంధనల్లో మార్పులు చేసింది. తక్కువ ధర, నాణ్యత లేని​ చైనా ఉత్పత్తుల దిగుమతులను చాలా కీలక విభాగాల్లో ఉండకుండా నిర్ణయాలు తీసుకుంది. భారత్​లో కీలక రంగాల వృద్ధికి ఆత్మ నిర్భర్​ భారత్​ అభియాన్​ పేరుతో మే నెలలోనే కార్యక్రమాన్ని ప్రారంభించింది కేంద్రం.

కరోనా వల్ల చైనా నుంచి సరఫరా నిలిచి, వాణిజ్యపరంగా ఇబ్బందులు పెరగ్గా.. గల్వాన్​ ఘర్షణ తర్వాత అది మరింత దిగజారింది. అందుకే చైనాపై ఆధారపడటం తగ్గించాలనే కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇక సరిహద్దుల్లోనూ డ్రాగన్​ దురాక్రమణ వైఖరికి బుద్ధి చెప్పేందుకు ఎక్కడా తగ్గట్లేదు. 5 నెలలుగా విపరీత పరిస్థితులను తట్టుకొని భారత సైన్యం లద్ధాఖ్​లో నిరంతరాయంగా విధుల్లోనే ఉంది.

ఆశ్చర్యపోయే లెక్కలు..

భారత్​ చైనాకు తక్కువ ధర ఉన్న వస్తువులు, ముడి సరుకును పంపిస్తుంటే.. చైనా దాన్ని తుది ఉత్పత్తులుగా మార్చి మన దేశానికే భారీ ధరకు అమ్ముతోంది. ముఖ్యంగా టెలికాం పరికరాలు, కంప్యూటర్​ హార్డ్​వేర్​, ఐటీ ఉత్పత్తులు, మొబైల్​ ఫోన్లు, వాటి విడిభాగాలను మనకు అమ్మి బాగా లాభం పొందుతోంది చైనా.

చైనా-భారత్​ వాణిజ్యాన్ని ఒక్కసారి పరిశీలిస్తే.. భారత్​ మొత్తం ఎలక్ట్రానిక్​ దిగుమతుల్లో 45 శాతం చైనా నుంచే వస్తున్నాయి. యంత్రాల విడిభాగాలు సహా 40 శాతం ఆర్గానిక్​ కెమికల్స్ చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. సీఐఐ చేసిన ఓ సర్వే ప్రకారం.. ఇండియాలో వినియోగించే ఆటోమేటివ్​ పార్ట్స్​, రసాయనాల్లో దాదాపు 25 శాతం చైనావే. ఫార్మాలో ఉపయోగించే ముడిసరకులో 70 శాతం చైనాలోనే ఉత్పత్తి అవుతున్నాయి.

ఈ అంశంపైనా ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్​ అభిప్రాయం తెలియజేశారు. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడానికి స్పష్టమైన, దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలని అన్నారు. చాలా సంవత్సరాల విధానాలు అమలు చేయాల్సిన అవసరముందని స్పష్టం చేశారు.

" ప్రభుత్వ విధివిధానాల్లో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. దేశీయ తయారీకి ప్రోత్సాహకాలు, సబ్సిడీ వంటి ప్రత్యేమైన పద్ధతులతో సాయాన్ని అందిస్తూ ఆ మార్పు సాధించవచ్చు. ఇప్పటికిప్పుడే కఠిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. వాణిజ్య అసమతుల్యతను దిద్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది"

--రమా సుబ్రహ్మణ్యం గాంధీ, ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్​

వాణిజ్యంలో మార్పులొస్తున్నాయ్​..

పలు కారణాల వల్ల 2019-20 కాలంలో చైనాతో వాణిజ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. ఇప్పటికే కరోనా వల్ల సరఫరా వ్యవస్థలు​ దెబ్బతింది. ఇరు దేశాల మధ్య గతేడాది 87.05 బిలియన్​ డాలర్ల వ్యాపారం జరిగింది. ఈ ఏడాది అది కాస్తా 81.86 బిలియన్​ డాలర్లకు చేరింది. అంటే 5.19 బిలియన్​ డాలర్ల మేర వాణిజ్యం తగ్గింది. చైనాతో వాణిజ్య లోటు 53.55 బిలియన్​ డాలర్లు ఉండగా.. ఈ ఏడాది అది కాస్తా 48.66 బిలియన్​ డాలర్ల లోటుకు చేరింది.

(-- కృష్ణానంద్​ త్రిపాఠీ, సీనియర్​ జర్నలిస్ట్​)

ABOUT THE AUTHOR

...view details