నిలువెత్తు స్వచ్ఛతా స్ఫూర్తికి జాతిపిత మహాత్మాగాంధీ పెట్టింది పేరు. ఆయన జయంతికి ఒకరోజు ముందు- దేశవ్యాప్తంగా నగరాలన్నింటా పరిశుభ్రత, జలభద్రతలను లక్షిస్తూ రెండు(Swachh Bharat 2.0)(Amrut Scheme) ప్రతిష్ఠాత్మక పథకాల మలి అంచె కార్యాచరణకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. వ్యక్తిస్థాయిలో శుచీశుభ్రతలకు ప్రణాళికాబద్ధ పారిశుద్ధ్య వసతులు జతపడిన నాగరిక సమాజాల్లో ఆయురారోగ్యాలకు సంపద వృద్ధికి ఢోకా ఉండదని ఎన్నో అధ్యయనాలు చాటుతున్నాయి. మరుగుదొడ్ల నిర్మాణం, వాయుకాలుష్య నియంత్రణ, వ్యర్థజలాల పరిశుద్ధీకరణ తదితరాలకోసం ఉద్దేశించిన స్వచ్ఛ భారత్ (పట్టణ)(Swachh Bharat 2.0) పథకం రెండో దశ ప్రణాళికలో- ఆ సద్వివేచన ప్రస్ఫుటమవుతోంది. దేశంలోని 4730 పట్టణ స్థానిక సంస్థల్లో 2.68 కోట్ల నల్లా కనెక్షన్లు, 500 పట్టణాల్లోని ప్రతి ఇంటికీ మరుగు వ్యర్థాల కనెక్షన్లు ఇవ్వడానికి అమృత్ (అటల్ పట్టణ రూపాంతరీకరణ పునరుజ్జీవన యోజన)(Amrut Scheme) రెండోదశను పట్టాలకు ఎక్కిస్తున్నారు.
పాఠాలు నేర్చి ముందడుగు వేస్తే..
అమృత్ పథకం(Amrut Scheme) పరిధిలోకి రాని అన్ని పట్టణ ప్రాంతాల్లో 'స్వచ్ఛ భారత్'(Swachh Bharat 2.0) కింద మురికినీటి నిర్వహణ చేపడతామంటున్నారు. పట్టణాల్ని స్వచ్ఛ నెలవులుగా తీర్చిదిద్దడంలో భాగంగా రెండు భూరి పథకాల పద్దులో మొత్తం రూ.4.28 లక్షలకోట్ల మేర వ్యయీకరించనున్నట్లు అధికారిక ప్రకటన వెల్లడిస్తోంది. అందుకోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచీ రుణసమీకరణ యోచన వెలుగు చూసింది. చెత్తశుద్ధితో పట్టణ ప్రాంతాల పునరుద్ధరణను తద్వారా స్వచ్ఛ భారతావని ఆవిష్కరణను సుసాధ్యం చేస్తామంటున్న సంకల్ప దీక్ష వీనులవిందుగా ఉంది. ఏడేళ్ల స్వచ్ఛభారత్, ఆరేళ్ల అమృత్ తొలిదశ ఫలితాలనుంచి ప్రభుత్వ యంత్రాంగం విలువైన పాఠాలు నేర్చి ముందడుగు వేస్తే- మలి అంకంలో మెరుగైన ఫలితాల సాధన సాకారమవుతుంది.
పనుల అమల్లో విఫలం..!