శ్రీలింగముద్ర:
సుఖాసనం లేదా వజ్రాసనంలో కూర్చుని వెన్నెముక నిటారుగా ఉంచాలి. రెండు చేతుల వేళ్లను కలిపి బొటనవేలు పైన ఉంచాలి. మహిళలు ఎడమ బొటనవేలు, మగవాళ్లు కుడి బొటనవేలు పైకి ఉంచాలి. చేతులు శరీరానికి తాకకుండా నాభికి, హృదయానికి మధ్య ఉండేలా చూసుకోవాలి. కళ్లు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచాలి. కనీసం మూడు నుంచి ఐదు నిమిషాలపాటు ఈ ముద్రలో కూర్చోవాలి. దీనివల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఉదయం, సాయంత్రం ఈ ముద్ర వేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా కూర్చుని ధ్యానం కూడా చేయొచ్చు.