తెలంగాణ

telangana

By

Published : Feb 7, 2021, 7:39 PM IST

ETV Bharat / jagte-raho

కాలువలో కొట్టుకొచ్చిన యువతి మృతదేహం

సూర్యాపేట జిల్లాలో ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

young woman died suspiciously in srsp canal in suryapet district
కాలువలో కొట్టుకొచ్చిన యువతి మృతదేహం

సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం సీతారాంపురం గ్రామంలోని ఎస్సారెస్పీ కాలువలోకి ఓ యువతి మృత దేహం కొట్టుకొచ్చింది. మృతి చెందిన యువతి నాగారం గ్రామానికి చెందిన ఓర్సు ఉప్పలయ్య కూతురు లావణ్య(19) గా పోలీసులు గుర్తించారు.

ఈ నెల 5వ తేదీన తిరుమలగిరి నుంచి సొంత గ్రామమైన నాగారానికి వెళ్లి వస్తానని ఇంట్లో నుంచి బయటకు వెళ్లి.. తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆచూకీ కోసం వెతుకుతుండగా కాలువలో శవమై కొట్టుకొచ్చినట్లు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:యువతిని రక్షించిన రెస్క్యూ టీంకు అభినందనలు

ABOUT THE AUTHOR

...view details