తెలంగాణ

telangana

By

Published : Dec 5, 2020, 3:31 PM IST

Updated : Dec 5, 2020, 4:37 PM IST

ETV Bharat / jagte-raho

తహసీల్దార్​ కార్యాలయంలో యువతి ఆత్మహత్యాయత్నం

తహసీల్దార్​ కార్యాలయంలో యువతి ఆత్మహత్యాయత్నం
తహసీల్దార్​ కార్యాలయంలో యువతి ఆత్మహత్యాయత్నం

15:29 December 05

తహసీల్దార్​ కార్యాలయంలో యువతి ఆత్మహత్యాయత్నం

భద్రాద్రి జిల్లా పాల్వంచ తహసీల్దార్​ కార్యాలయంలో ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. గ్రామానికి చెందిన భూక్యా జ్యోతికి చెందిన స్థల వివాదంలో తహసీల్దార్​ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడింది.

స్థల వివాదం విషయంలో ఇరువర్గాలను చర్చకు తహసీల్దార్ పిలవగా... ఆయన​ సమక్షంలోనే ప్రత్యర్థివర్గం వారు దాడి చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరగట్లేదన్న మనస్తాపంతో కార్యాలయంలోని ఫ్యాన్​కు ఊరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. అక్కడే ఉన్న స్థానికులు స్పందిచి యువతిని అడ్డుకున్నారు.

ఇదీ చూడండి: హోటళ్లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి


 

Last Updated : Dec 5, 2020, 4:37 PM IST

ABOUT THE AUTHOR

...view details