నెల్లూరు జిల్లా నాయుడుపేట రైల్వే స్టేషన్ ఆవరణలో ఓ యువకుడు సెల్ టవర్పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన గొడవలో పోలీసులు తనకు న్యాయం చేయలేదన్న కారణంతో టవర్ ఎక్కి దూకేస్తానని బెదిరించాడు.
'నాకు అన్యాయం జరిగింది... నేను చచ్చిపోతా' - నాయుడుపేటలో సెల్ టవర్ ఎక్కిన యువకుడి వార్తలు
రెండు కుటుంబాల మధ్య జరిగిన వివాదంలో తనకు న్యాయం జరగలేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జరిగింది.
!['నాకు అన్యాయం జరిగింది... నేను చచ్చిపోతా' young-person-climb-a-cell-tower-in-naidupet-nellore-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9082964-407-9082964-1602065907998.jpg)
'నాకు అన్యాయం జరిగింది... నేను చచ్చిపోతా'
సమాచారం అందుకున్న సీఐ వేణుగోపాల్ రెడ్డి... ఘటన స్థలానికి చేరుకుని యువకుడికి న్యాయం చేస్తామన్నారు. సీఐ ఇచ్చిన హామీతో యువకుడు టవర్ దిగి వచ్చాడు.
ఇవీ చదవండి:అత్తమామల వేధింపులతో వివాహితుడు ఆత్మహత్య