తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

సెల్ఫీ దిగేందుకు వెళ్లి... వాగు ఉద్ధృతిలో బలి

ఏళ్ల తర్వాత వాగు నిండుగా ప్రవహించడాన్ని చూసేందుకు జనాలు గుంపులుగా తరలివచ్చారు. కొందరు యువకులు ఉత్సాహంతో అందులో ఈత కొడుతూ సెల్పీలు దిగారు. ఓ యువకుడు సైతం సెల్ఫీ దిగేందుకు యత్నించి వాగు ఉద్ధృతికి బలయ్యాడు. ఈ ఘటన మహబూబ్​నగర్​ జిల్లాలోని లింగంపేట సమీపంలోని దుందుభి వాగులో చోటుచేసుకుంది.

By

Published : Sep 19, 2020, 5:23 PM IST

young man washed out in dundubhi river at lingampet
young man washed out in dundubhi river at lingampet

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం లింగంపేట గ్రామ సమీపంలోని దుందుభి వాగులో విషాదం చోటుచేసుకుంది. ఏళ్ల తరువాత నిండుగా ప్రవహిస్తోన్న దుందుభి వాగును చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వాగులో ఈత కొడుతూ... సరదాగా సెల్ఫీలు దిగుతున్నారు. ఈ క్రమంలోనే... అఫ్రోజ్​ అనే 22 ఏళ్ల యువకుడు ఈత కొడుతూ సెల్ఫీ దిగేందుకు యత్నించాడు. ప్రమాద వాశాత్తు నీటిలో పడిపోయాడు. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం వల్ల అందరూ చూస్తుండగానే... అఫ్రోజ్​ కొట్టుకుపోయాడు.

గల్లంతుకు ముందు...
గల్లంతుకు ముందు...

స్థానికులు స్పందించి కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. సమాచారం తెలిసి అధికారులు సైతం సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా శ్రమించినా.... ప్రయోజనం లేకుండా పోయింది. ఎంత వెతికినా వాగు ఉద్ధృతికి అఫ్రోజ్​ కన్పించలేదు. ఈ క్రమంలో... ప్రజలెవ్వరూ వాగు వద్దకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

మృతుడు అఫ్రోజ్​(ఫైల్​)

ఇదీ చూడండి:చేపల వేటకు వెళ్లి.. నీట మునిగి వృద్ధుడు మృతి

ABOUT THE AUTHOR

...view details