తెలంగాణ

telangana

కరోనా సోకిందని యువకుడి ఆత్మహత్య

By

Published : Sep 24, 2020, 1:30 PM IST

వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లిలో విషాదం చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్​ వచ్చిందన్న మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకుని బలవన్మరణం చెందాడు.

కరోనా సోకిందన్న మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య
కరోనా సోకిందన్న మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య

కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయిన ఓ యువకుడు మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లిలో ఈ విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాగరాజు (20) ఇంటర్ పూర్తి చేసి రెండేళ్లుగా ఇంటి వద్దే ఉంటున్నాడు. తాజాగా బంధువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లొచ్చాడు.

వచ్చిన నాలుగు రోజుల తర్వాత జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు రావటం వల్ల అనుమానంతో కరోనా పరీక్ష చేయించుకున్నాడు. తీరా ఫలితాల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. వైరస్​ సోకిందని తీవ్ర మనస్తాపానికి గురైన నాగరాజు... ఇంట్లో ఎవరూలేని సమయంలో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి దూడయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 2,176 కరోనా కేసులు, 8 మరణాలు

ABOUT THE AUTHOR

...view details