తెలంగాణ

telangana

By

Published : Jan 10, 2021, 8:07 PM IST

ETV Bharat / jagte-raho

అమ్మా... నాకు బతకాలని లేదు!

అమ్మా నేను చనిపోతున్నాను... నాకు బతకాలని లేదని తల్లికి ఫోన్ చేసి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. బయటకు వెళ్తున్నా అని చెప్పి నదిలో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

young-man-suicide-at-rajoli-in-jogulamba-gadwal-district
అమ్మా... నాకు బతకాలని లేదు!

అమ్మా... నాకు బతకాలని లేదు, నేను చనిపోతున్నానని తల్లికి ఫోన్ చేసి నదిలో దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజోలి గ్రామానికి చెందిన మెయిబు పదో తరగతి పూర్తి చేసి మగ్గం నేస్తూ తల్లికి తోడుగా ఉంటున్నాడు. కొన్ని రోజులుగా మతిస్థిమితం కోల్పోయి చనిపోతానంటూ తిరుగుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో ఒకసారి చేయి కోసుకున్నాడని పేర్కొన్నారు.

ఆదివారం ఉదయం బయటకు వెళ్తున్నానని చెప్పి రాజోలిలోని నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై వివరించారు. కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:మానసిక వేదన: పిల్లల కలగడంలేదని మహిళ ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details