ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్లో చోటుచేసుకుంది. ఇందిరమ్మ కాలనీలో నిర్మిస్తున్న ఓ ప్రభుత్వ భవనంలో కార్మికునిగా పనిచేస్తున్న మధ్యప్రదేశ్ కి చెందిన ఖుప్చంద్ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి దుర్మరణం పాలయ్యాడు.
నీటి సంపులో పడి యువకుడి మృతి - Young man died in bodhan
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ శివారులోని ఇందిరమ్మ కాలనీలో ఓ యువకుడు నీటి సంపులో పడి మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

నీటి సంపులో పడి యువకుడి మృతి
కాలకృత్యాలు తీర్చుకోవడానికి బయటకి వెళ్లిన వ్యక్తి ఉదయం వరకు రాకపోయేసరికి చుట్టుపక్కల గాలించగా నీటి తొట్టిలో తేలాడు. ఘటనా స్థలికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: నేడు నమామి గంగా ప్రాజెక్టులను ఆవిష్కరించనున్న మోదీ