తెలంగాణ

telangana

బోరు మోటర్​తో విద్యుదాఘాతం.. యువకుడు మృతి

By

Published : Jan 4, 2021, 11:38 AM IST

రోజులాగే పొలానికి వెళ్లిన ఆ యువకుడిని.. కరెంటు రూపంలో మృత్యువు కబళించింది. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

young man died of electrocution in kamareddy district
బోరు మోటర్​తో విద్యుదాఘాతం.. యువకుడు మృతి

విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ మండలం దోస్త్ పల్లి శివారులో చోటుచేసుకుంది. మృతుడు మారుతి (16) పంటకు సాగునీరు అందించేందుకు బోరు మోటర్​ను స్టార్ట్ చేస్తుండగా.. ప్రమాదం జరిగినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. యువకుడి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి:వ్యవసాయ భూమిలో విద్యుదాఘాతం.. రైతు మృతి

ABOUT THE AUTHOR

...view details