తెలంగాణ

telangana

తల్లిదండ్రులు మందలించారని యువకుడు ఆత్మహత్య

By

Published : Jan 7, 2021, 2:58 PM IST

చిన్న చిన్ని విషయాలకే... నిండు జీవితాన్ని అర్ధాంతరంగా ముగుస్తున్నారు. తల్లిదండ్రులు మందలించారని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

suicide news
తల్లిదండ్రులు మందలించారని యువకుడు ఆత్మహత్య

కామారెడ్డి జిల్లా దేవునిపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రులు మందలించారని డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న నీలం రాహుల్​(18) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

నిన్న రాత్రి తన స్నేహితుడి సోదరుడు పెళ్లి బరాత్‌కు రాహుల్ వెళ్లాడు. ఆలస్యం కావడంతో ఫొన్ చేసి రాహుల్‌ను తల్లిదండ్రులు మందలించారు. దీనితో మనస్తాపం చెందిన రాహుల్​... ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

తన కుమారుడు కడుపునొప్పి తీవ్రం కావడంతో.. భరించలేక ఆత్మహత్య చేసుకున్నారని తల్లిదండ్రులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:'ఆ భూములు మా నాన్న కొన్నవి.. ఇవ్వాల్సిందే'

ABOUT THE AUTHOR

...view details