భార్య కాపురానికి రాలేదని యువకుడు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నాగర్కర్నూలు జిల్లా కోడేరులో చోటుచేసుకుంది. భార్య దసరా పండగకు హైదరాబాద్ వెళ్లింది. బుధవారం నాడు సుధాకర్ తన భార్యకు ఫోన్ చేసి కోడేరుకు రావాలని కోరాడు.
భార్య కాపురానికి రాలేదని యువకుడు ఆత్మహత్య - nagar karnool latest crime news
నాగర్కర్నూలు జిల్లా కోడేరులో భార్య కాపురానికి రాలేదనే మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
![భార్య కాపురానికి రాలేదని యువకుడు ఆత్మహత్య young man committed suicide because his wife did not come to home in nagar karnool](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9359148-503-9359148-1603983405129.jpg)
భార్య కాపురానికి రాలేదని యువకుడు ఆత్మహత్య
అయితే ఇంటికి రావడం లేదని మనస్థాపం చెందిన సుధాకర్ తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి చెప్పారు.
ఇదీ చూడండి:ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి